Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆ మధ్య ఆడవారిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే అందుకు ఓ బలమైన కారణం ఉందట. మరి అదేంటో తెలుసుకుందాం.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చుట్టూ వివాదం మరోసారి చర్చనీయాంశం అవుతుంది. చిరంజీవి ఆ మధ్య బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన `బ్రహ్మా ఆనందం` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడపిల్లలపై చేసిన కామెంట్ వివాదంగా మారిన విషయం తెలిసిందే.
తన ఇంట్లో ఆడవాళ్లు ఎక్కువగా ఉన్నారని, తాను లేడీస్ హాస్టల్కి వార్డెన్లా ఉన్నానని తెలిపారు. అంతేకాదు రామ్ చరణ్ని ఈ సారి కొడుకుని ఇవ్వమని, మళ్లీ అమ్మాయిని కంటాడేమో అని భయంగా ఉందని కామెంట్ చేశారు చిరు.
ఆడవారిపై చిరంజీవి వ్యాఖ్యలు, కిరణ్ బేడీ స్ట్రాంగ్ కౌంటర్..
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి పెద్దగా, మెగాస్టార్ రేంజ్ లో ఉన్న చిరంజీవి నుంచి ఇలాంటి కామెంట్లు రావడం వివాదంగా మారింది. ఆయన పబ్లిక్ ఈవెంట్లో ఈ వ్యాఖ్యలు చేయడం పెద్ద రచ్చ అయ్యింది. అది ఆడవారిని తక్కువ చేసిన మాట్లాడినట్టుగా వెళ్లింది. దీనిపై మహిళలు అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి.
తాజాగా మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని అమ్మాయిలను కని గొప్ప వారిని చేసిన పేరెంట్స్ ని చూసి నేర్చుకోవాలని, ఆడవారు తక్కువ కాదని ఆమె తెలిపారు. బాధ్యాతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి కామెంట్లు చేయడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
also read: చిరంజీవి ఆ పేరెంట్స్ ని చూసి నేర్చుకోండి.. మెగాస్టార్కి కిరణ్ బేడీ స్ట్రాంగ్ కౌంటర్.. రచ్చ రచ్చ
చిరంజీవి స్వయంగా ఇంట్లో ఆ విషయాన్ని ఫేస్ చేస్తున్నాడా?
ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి చిరంజీవి చుట్టూ వివాదంగా రాజుకుంది. `బ్రహ్మా ఆనందం` ఈవెంట్ లో ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద రచ్చ అవుతున్నాయి. మరి చిరు ఆ మాట అనడానికి కారమేంటి? ఆడవారిపై నోరు జారగడానికి బలమైన కారణం ఉందా? ఆయన స్వయంగా దాన్ని ఫేస్ చేశాడా? అంటే అనువనే మాట వినిపిస్తుంది.
స్వయంగా తన ఇంట్లోనే మెగాస్టార్ దాన్ని ఫేస్ చేశాడు. బహుశా అందుకే అలాంటి కామెంట్ చేశాడని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. మరి ఇంతకి చిరు ఏం ఫేస్ చేశాడంటే. ఆయన ఇంట్లోనే దాదాపు పది మందికిపైగా ఆడవాళ్లు ఉండటమే కారణమని తెలుస్తుంది.
చిరంజీవితోడ ఇద్దరు సిస్టర్స్.. ఇద్దరు కూతుళ్లు, వారికి ఇద్దరిద్దరు కూతుళ్లు..
చిరంజీవి తోడ ఇద్దరు సిస్టర్స్ పద్మజ, విజయ దుర్గ ఉన్నారు. ఇక చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు. సుస్మిత, శ్రీజ. సుస్మితకి ఎల్వీ విష్ణు ప్రసాద్తో పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుళ్లే. సమర, సమిత జన్మించారు. అలాగే చిన్న కూతురు శ్రీజ మొదట ప్రేమించిన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
శిరీష్ భరద్వాజ్ని ప్రేమించి పెళ్లి(2007) చేసుకుంది. వీరికి నవ్రతి జన్మించారు. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత(2016) నటుడు కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకుంది. వీరికి నవిక్ష జన్మించారు. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ కూడ విడిపోయారు. ఇప్పుడు వీరంతా చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నారు.
ఇంట్లో మొత్తం పది మంది ఆడవాళ్లు..అందుకే చిరంజీవి లేడీస్ హాస్టల్ వార్డెన్ ఫీలింగ్
దీనికితోడు రామ్ చరణ్కి ఉపాసనతో పెళ్లి అయ్యింది. రెండేళ్ల క్రితం వీరికి కూతురు క్లీంకార జన్మించింది. ఆమెకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా, సెలబ్రేషన్లా చేశారు మెగాస్టార్. మళ్లీ ఆడపిల్ల పుట్టిందనే ఫీలింగ్ ఏ కొంత కూడా ఆయనలో కనిపించలేదు, అలా పబ్లిక్గా బిహేవ్ చేయలేదు.
సంతోషంగా క్లీంకారకి సంబంధించిన ప్రతిది సెలబ్రేషన్స్ చేస్తూ ఫోటోలను కూడా మీడియాకి పంచుకున్నారు. చిరు మదర్ అంజనాదేవి కూడా తనతో పాటే ఉంటుంది. దీంతో ఇప్పుడు అంజనాదేవి, సురేఖ, ఉపాసన, ఉపాసన కూతురు క్లీంకార, సుస్మిత,.. ఆమె ఇద్దరు కూతుళ్లు, శ్రీజ.. ఆమె ఇద్దరు కూతుళ్లు ఇలా పది మంది ఆడపిల్లలు చిరంజీవి ఇంట్లో ఉంటున్నారు.
దీంతో చుట్టూ అంతా ఆడపిల్లలే కావడంతో చిరంజీవికి తాను లేడీస్ హాస్టల్ వార్డెన్ ఫీలింగ్ కలుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు తన వంశం నిలబడటం కోసం ఆయన మగ పిల్లాడిని కోరుకున్నారు.
చిరంజీవి కోరిక వ్యక్తిగతం.. కానీ పబ్లిక్ గా ఈ వ్యాఖ్యలు తప్పే..
చిరంజీవి పర్సల్ పాయింట్ఆఫ్ వ్యూలో ఆయన ఆలోచన, ఆయన ఫీలింగ్ ఆయన వరకు కరెక్టే, కానీ అది సమాజంలోకి వెళ్లినప్పుడు ఆడవారిని తక్కువ చేసినట్టే అవుతుంది. వ్యక్తిగతంగా ఇంట్లో ఏం మాట్లాడుకున్నా సమస్య రాదు, పబ్లిక్ ఈవెంట్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు,
ఎందుకంటే మెగాస్టార్ కోట్లమందిని ఇన్స్పైర్ చేసే స్థాయిలో ఉన్నారు, ఎంతో మంది ఆయన్ని చూసి సినిమాల్లోకి వచ్చారు. ఇన్ స్పైర్ అయ్యారు. ఇప్పటికీ ఇన్స్పైర్ అవుతుంటారు. పైగా ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా, రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తరచూ సీఎంలు, పీఎంలను మీట్ అవుతుంటారు.
అలాంటి స్థాయిలో ఉన్న చిరంజీవి వ్యాఖ్యలు ఈజీగా జనాల్లోకి వెళ్తాయి. సమాజంపై అవి ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆడపిల్లలూ తక్కువ కాదని, ప్రోత్సహించి సరైన మార్గంలో తీసుకెళితే దేశాన్ని శాషించే స్థాయిలో ఉంటారని చిరంజీవి లాంటి పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.