'సర్కారు వారిపాట' లో సముద్రఖని, కేక పెట్టించే క్యారక్టర్
దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారిపాట'. ఈ సినిమా సెట్ లో విలక్షణ నటుడు సముద్రఖని అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాజా షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిన్నటి నుంచ మొదలైంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఇందులో ఓ కీలక పాత్రను సముద్రఖని పోషిస్తుండగా, ఆయన పాత్రకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసేందుకు షూటింగ్లో పాల్గొంటున్నారట. లోకల్ గా మహేష్ తో తలపడే విలన్ గా సముద్ర ఖని కనిపిస్తాడని అంటున్నారు. మెయిన్ విలన్ వేరేగా ఉంటారని చెప్తున్నారు. విలక్షణమైన మేనరిజంతో సముద్ర ఖని పాత్ర సినిమాలో హైలెట్ అవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా మహేష్ కు, సముద్ర ఖనికి మధ్య వచ్చే సీన్స్ ఫస్టాఫ్ లో బాగుంటాయని అంటున్నారు.
చిత్రం స్టోరీ లైన్ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో తండ్రి పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.
సముద్ర ఖని విషయానికి వస్తే...అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో', రవితేజ నటించిన 'క్రాక్' సినిమాలో విలన్గా నటించి తెలుగు ఇండస్ట్రీలో బాగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇదే క్రమంలో 'సర్కారు వారి పాటలో'నూ నటిస్తున్నాడట. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. 2022, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది. మధి కెమెరా మెన్గా చేస్తుండగా మార్తండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ చేస్తున్నారు.