శ్రీదేవికి అక్షల్లో అభిమానులు ఉండటంతో.. ఆమె జనాల్లోకి రావడానికి అస్సలు సాధ్యం అయ్యేది కాదు.  దీనివల్ల బహిరంగ ప్రదేశాల్లో తిరగడం కష్టమయ్యేది. ఆమె కనిపిస్తే అభిమానులు గుమిగూడేవారు. అయితే ఈసమస్య నుంచి బయటపడటానికి శ్రీదేవి ఓ సందర్భంలో ఓ ప్లాన్ ను అమలు చేశారు. 

భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటి శ్రీదేవి. ఆమె గురించి చాలా ఆసక్తికరమైన సంఘటనలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అలాంటి ఒక సంఘటనను కమల్ హాసన్ బయటపెట్టారు. తన అభిమాన నటుడు కమల్ హాసన్ నటించి, దర్శకత్వం వహించిన 'హే రామ్' సినిమాను థియేటర్లో చూడడానికి శ్రీదేవి బుర్ఖా వేసుకుని వెళ్ళారట.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

2000 సంవత్సరంలో 'హే రామ్' సినిమా విడుదల సమయంలో కమల్ హాసన్ ఈ విషయాన్ని చెప్పారు. శ్రీదేవికి 'హే రామ్' సినిమాను చెన్నైలోని సత్యం సినిమాస్ థియేటర్లో చూడాలని ఉండేది. కానీ, ఆ సమయంలో శ్రీదేవి భారతదేశంలోనే అతిపెద్ద స్టార్లలో ఒకరు. ఆమె జనాదరణ వల్ల బహిరంగ ప్రదేశాల్లో తిరగడం కష్టం. ఆమె కనిపిస్తే అభిమానులు గుమిగూడేవారు, దీనివల్ల ఆమెకు, ఇతరులకు ఇబ్బంది కలిగేది.

ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి శ్రీదేవి బుర్ఖా వేసుకుని సత్యం థియేటర్ కి వెళ్లి 'హే రామ్' సినిమా చూశారు. ఎంత పెద్ద స్టారైనా సినిమాను ప్రేక్షకులతో కలిసి చూడాలనే కోరిక ఆమెకు ఉండేది.

'హే రామ్' సినిమాలో రాణి ముఖర్జీ పాత్రకు మొదట శ్రీదేవిని అనుకున్నారట. కానీ, డేట్స్ సరిపోక ఆమె ఆ పాత్ర చేయలేకపోయింది. సినిమా చూసిన తర్వాత శ్రీదేవి కమల్ హాసన్ కి ఫోన్ చేసి సినిమా బాగుందని చెప్పారు.

కమల్ హాసన్ దర్శకత్వం, నటన, రాణి ముఖర్జీ నటనను శ్రీదేవి మెచ్చుకున్నారు. అంతేకాదు, అలాంటి సినిమాలో నటించలేకపోయానని బాధపడ్డారని కమల్ హాసన్ చెప్పారు.