Asianet News TeluguAsianet News Telugu

డైవర్స్ డిప్రెషన్ నుండి బయటపడటానికి సమంత ఏం చేస్తోందంటే...

‘ఏమాయ చేసావే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. హీరోయిన్‌గానే కాకుండా బిజినెస్ ఉమన్‌గానూ సామ్ రాణిస్తోంది. టాప్ హీరోయిన్‌గా సామ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సిరీస్‌పైన దృష్టి సారించింది. నాగచైతన్యతో మ్యారేజ్ తర్వాత సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది.

Samantha signs her first Bollywood movie
Author
Mumbai, First Published Oct 13, 2021, 2:00 PM IST

నాగచైతన్యతో విడిపోయాక మళ్లీ కెరీర్ మీద ఫోకస్ చేసింది సామ్ . వరసపెట్టి కొత్త ప్రాజెక్టులను ఒకే చేసిన పనిలో పడింది. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్ కోసం కొన్ని ప్రాజెక్టులు ప్రక్కన పెట్టేసింది. కానీ, ఇప్పుడు మళ్ళీ కొత్త స్టోరీలు వింటోంది. అందులో భాగంగా బాలీవుడ్ చిత్రం సైన్ చేసింది. దసరా రోజున ఈ సినిమా విషయమై ప్రకనట వచ్చే అవాకశం ఉంది.

వాస్తవానికి బాలీవుడ్ లో సమంత చేసిన ఫ్యామిలీ మాన్ 2 పెద్ద హిట్ . దాంతో  సామ్ కి అక్కడ భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిని ఇగ్నోర్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. తెలుగులోనూ ఓ సినిమా చేస్తోంది. కృష్ణ ప్రసాద్ నిర్మాతగా ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేస్తోంది. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ బాలీవుడ్ ప్రాజెక్టు. ఆ తర్వాత మరిన్ని సినిమాలు చేయబోతోంది. తన కొత్త కమిట్మెంట్స్ తో  డైవర్స్ డిప్రెషన్ నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

Also read సమంత పర్సనల్ స్టైలిష్ ప్రీతమ్ జూకాల్కర్ కి బెదిరింపులు... అతన్ని టార్గెట్ చేయడానికి గల కారణం ఇదే!

మరోవైపు తెలుగులో శాకుంతలం పూర్తిచేసిన సమంతా ప్రస్తుతం తమిళ సినిమాతో బిజీగా ఉంది.  ప‌దేళ్ల ప్రేమాయ‌ణం.. మూడేళ్ల వైవాహిక బంధానికి తెర దించారు నాగ చైత‌న్య‌ – స‌మంత‌.  చైతూ కంటే ఎక్కువ నెగిటివిటీని సమంతనే ఫేస్ చేస్తోంది. అందుకే విడాకుల ప్రకటన తర్వాత తన భావాలన్నీ పరోక్షంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌‌తో పంచుకుంటోంది సామ్. ఇటీవ‌ల త‌న‌పై వ‌స్తున్న రూమర్స్ కి సుదీర్ఘ పోస్ట్ ద్వారా సామ్ క్లారిటీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. 

Also read విడిపోయాక సమంత ఉండబోతోంది అక్కడే, చైతూ మాత్రం...

స‌మంత న‌టించిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ జ‌రుపుకుంటోంది. శకుంతలగా సమంత నటిస్తుండగా, దుష్యంతుడి పాత్రను ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ పోషిస్తున్నారు. ఇక చిన్నారి భరతుడిగా అల్లు అర్జున్ కుమార్తే బేబీ అర్హ అలరించబోతోంది. సోమవారం నుండి డబ్బింగ్ ప్రారంభించినట్టు గుణ టీమ్ వర్క్స్ సంస్థ తెలిపింది. పాన్ ఇండియా మూవీగా పలు భారతీయ భాషల్లో ఒకేసారి వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios