భారత్ గర్వించదగ్గ `ఛత్రపతి శివాజీ మహారాజ్` పాత్రలో రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమా 2027 జనవరి 21న విడుదల కానుంది.  

ఛత్రపతి శివాజీ కొడుకు శంబాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా రూపొందిన `ఛావా` సినిమా దుమ్ములేపుతుంది. బాలీవుడ్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఈ సినిమా భారీ వసూళ్ల దిశగా వెళ్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో హిస్టారికల్‌ మూవీ రాబోతుంది. ఛత్రపతి శివాజీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమాని తెరకెక్కిస్తున్నారు. రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తున్నారు. 

భారతదేశం ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని జరుపుకుంటున్న వేళ, 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్' సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి మరాఠా యోధుడిగా నటిస్తున్నారు. సినిమా అధికారిక X ఖాతాలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శెట్టి మరాఠా పాలకుడిగా శక్తి, భక్తి, ధైర్యంగా కనిపిస్తున్నారు. పోస్టర్‌తో పాటు, మేకర్స్ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు.

"జై భవాని! జై శివాజీ! హర్ హర్ మహాదేవ్!! గొప్ప యోధుడు, రాజు 395వ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం. ఖండం యొక్క రూపురేఖలు మార్చిన గొప్ప రాజు  బలం, భక్తిని తెలియజేస్తున్నాం. ఆయన ధైర్యం, గౌరవం, స్వరాజ్యం యొక్క అసాధారణ గాథను ఒక అద్భుతమైన బృందంతో తెరపైకి తీసుకురావడం చాలా గర్వంగా ఉంది. 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది` అని తెలిపింది టీమ్‌.
 సినిమా బృందం పంచుకున్న ప్రకటనలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ, "ఛత్రపతి శివాజీ మహారాజ్ పవిత్ర జయంతి సందర్భంగా నా హృదయం గౌరవంతో నిండిపోయింది. అతను కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, స్వరాజ్యానికి ఆత్మ వంటివాడు. ధైర్యం, జ్ఞానం, భక్తికి ప్రతీక. అతని స్ఫూర్తిని తెరపై చూపించడం ఒక దైవిక పిలుపు. అతని అసమాన వారసత్వానికి న్యాయం చేస్తానని, ప్రతి భారతీయుడిలో అతని ధైర్యాన్ని నింపుతానని ఆశిస్తున్నాను` అని చెప్పారు. 

read  more: అకీరా నందన్‌ హీరోగా లాంచింగ్‌ డేట్‌ ఫిక్స్ ?, డైరెక్టర్‌ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. నిర్మాత క్రేజీ ?

ఇదిలా ఉంటే, భారీ లైనప్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన వద్ద మైండ్‌ బ్లోయింగ్‌ లైనప్‌ ఉంటది. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రశాంత్ వర్మ సినిమా 'జై హనుమాన్'లో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ భారీ పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. మరోవైపు ఇప్పటికే సంచలనం సృష్టించిన `కాంతార`కి ప్రీక్వెల్‌ 'కాంతారా: చాప్టర్ 1'కి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు. ఇది ఈ సంవత్సరం అక్టోబర్ 2, 2025న విడుదల కానుంది. దీన్ని భారీ పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.

also read: `పుష్ప 2` దెబ్బకి `హాలీవుడ్‌ రిపోర్టర్‌`పైకి అల్లు అర్జున్‌.. ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక హీరో

దీనికితోడు మరో సంచలనం `ఛత్రపతి శివాజీ` సినిమాలో టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన `ఛావా`నే సంచలనం సృష్టిస్తుందంటే, రాబోయే `ఛత్రపతి శివాజీ మహారాజ్‌` ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో ఊహించుకుంటూనే మతిపోతుంది. ఈ సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తే రిషబ్‌ శెట్టి ఇండియా బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్స్ లో ఒకరిగా మారిపోతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

read more: అనుష్క శెట్టి నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? అస్సలు ఊహించరు.. అంతా నాగార్జున, రాజమౌళి పుణ్యమే!