Asianet News TeluguAsianet News Telugu

అఫీషియల్: `రంగ్‌దే` రిలీజ్ డేట్ ఫిక్స్

 ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఇది.  ‘తొలిప్రేమ’,’మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.  నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

Rang De To Release On March 26th jsp
Author
Hyderabad, First Published Jan 2, 2021, 10:47 AM IST

నితిన్ టైమ్ చాలా బాగుంది.  వరస ఫ్లాప్ ల తర్వాత వచ్చిన `భీష్మ‌` సూప‌ర్ హిట్‌…ఆ వెంట‌నే పెళ్లి.. ఇలా మాంచి జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ మరో చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించేసారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `రంగ్‌దే`. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై యంగ్ ప్రొడ్యూస‌ర్ సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.డి.వి. ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని మార్చి 26న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. కొత్త ఏడాది ఆరంభం సందర్భంగా ఓ వీడియోని కూడా విడుదల చేశారు. ‘‘ప్రేమతో కూడిన కుటుంబ కథగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో నితిన్‌, కీర్తి జంట కనువిందు చేయనుంది. థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని సినీ వర్గాలు తెలిపాయి.

 ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఇది.  ‘తొలిప్రేమ’,’మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.  నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత:సూర్యదేవర నాగవంశీ, రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి

Follow Us:
Download App:
  • android
  • ios