Asianet News TeluguAsianet News Telugu

`పలాస` డైరక్టర్ నెక్ట్స్.. ఆ హీరోతోనే!

`పలాస` నేపథ్యంలో అదిరిపోయే నేటివిటీతో సినిమా తీసి మెప్పించిన కరుణ కుమార్, ఆ తర్వాత మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. రెండు ప్రాజెక్టులు కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా, మంచి పేరు తెచ్చిపెట్టాయి. 

Palasa directors new film with noted hero confirmed
Author
Hyderabad, First Published Sep 14, 2020, 12:06 PM IST

టాలెంట్ ఉన్నవారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని మరో సారి రుజువైంది. తాజా సమాచారం మేరకు సుధీర్ బాబు తన తదుపరి చిత్రం పలాస దర్శకుడు కరుణ కుమార్ తో ప్లాన్ చేస్తునట్టు వినికిడి. శ్రీకాకుళం బార్డర్ `పలాస` నేపథ్యంలో అదిరిపోయే నేటివిటీతో సినిమా తీసి మెప్పించిన కరుణ కుమార్, ఆ తర్వాత మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. రెండు ప్రాజెక్టులు కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా, మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపధ్యంలో  కరుణ కుమార్ తను తయారు చేసిన కథను సుధీర్ బాబుకు చెప్పి ఓకే చేయించుకున్నారని తెలిసింది. 

ఇక ఈ సినిమాలో సుధీర్ బాబును కొత్తగా చూపించబోతున్నాడని తెలుస్తుంది. అదే విధంగా సరికొత్త యాసను మాట్లాడతాడని తెలుస్తోంది. సుధీర్ బాబు ఈ మధ్యనే వి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.`వి` చిత్రానికి మిశ్రమ స్పందనలు వ్యక్తమవగా సుధీర్ బాబు కాప్ రోల్ కి మాత్రం మంచి పేరొచ్చింది. ఈ సినిమా లో సుధీర్ బాబు యాక్టింగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. 

ఇక సుధీర్ బాబు పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో యాక్ట్ చేయాల్సి ఉండగా అది జనవరిలో మొదలవనుంది. ఈ బయోపిక్ కి దర్శకుడు ఎవరు అనేది ఇంకా స్పష్టత లేదు. త్వరలోనే ఈ సినిమా పై పూర్తి సమాచారం రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios