సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. ఎంతో ఆశతో తమ అభిమాన హీరో సినిమా చూద్దాం అని థియేటర్ కు వెళ్లినవారికి ఊహించని ట్విస్ట్ ఎదురయ్యింది. ఇంతకీ వారికి ఎదురైన అనుభవం ఏంటి?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనుష్క శెట్టి హీరోయిన్‌గా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఖలేజా ఇప్పటికి కూడా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. 2010లో విడుదలైన ఈ సినిమా మొదట నిరాశ పరచినా, కాలక్రమంలో కల్ట్ following సాధించింది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఖలేజా సినిమాను రీరిలీజ్ చేయాలని మూవీ టీమ్ నిర్ణయించి, ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీరిలీజ్ షెడ్యూల్ చేశారు.

ఈ రీరిలీజ్ కోసం ఫ్యాన్స్ భారీ ఎత్తున ఉత్సాహం చూపిస్తూ బుకింగ్స్ ను సెన్సేషనల్‌గా మార్చారు. అంతేకాదు, థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అయితే, ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ప్రీమియర్స్ పడినరోజే మహేష్ బాబు అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఎదురయ్యింది.

తాజాగా విడుదలైన ఖలేజా ప్రింట్‌లో ముఖ్యమైన పాటలు, సన్నివేశాలు కట్ చేశారు. దాంతో థియేటర్‌లో సినిమా చూస్తున్న ఫ్యాన్స్ మొదట షాక్ కి గురయ్యారు. తరువాత, తమకిష్టమైన సీన్లు లేకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ పరిణామంతో కొందరు అభిమానులు థియేటర్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. అయితే థియేటర్ యాజమాన్యం స్పందిస్తూ, మాకు అందిన ప్రింట్‌లోనే ఈ కట్లు ఉన్నాయి అంటూ సమాధానం ఇచ్చింది. ఈ వివరణతో చాలామంది ఫ్యాన్స్ అసంతృప్తి చెందారు. అసలు ఈ విధంగా ఎందుకు చేశారంటూ చర్చించుకున్నారు.

ఎంతో కాలం తర్వాత థియేటర్‌లో ఖలేజాను మళ్లీ చూడాలని ఆశపడిన అభిమానులకు, ఈ చేదు అనుభవం మిగిలింది, ఫ్యాన్స్ ఆశ నిరాశగా మారింది. రీరిలీజ్ కోసం ప్రమోషన్‌లు భారీగా చేసినప్పటికీ, అసలు విషయాన్ని మూవీ టీమ్ ముందుగా వెల్లడించలేదు. వారు అలా చేయడానికి గల కారణాలు ముందుగా వివరించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ సంఘటన మరోసారి రీరిలీజ్ చిత్రాల ప్రమాణాలపై ప్రశ్నలు రేపుతోంది. ప్రేక్షకులు అసలైన అనుభవం పొందాలంటే, పూర్తి వెర్షన్‌ను అందించడం అవసరం అనే అభిప్రాయాన్ని అభిమానులతో పాటు, సామాన్య ప్రేక్షకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.