రాజమౌళి తరువాత మహేష్ బాబు ప్లాన్ ఏంటి? ఎవరితో సినిమా చేయబోతున్నాడంటే?
రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. జక్కన్న సినిమా తరువాత ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన ప్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ ఉంది. మరి ఈ సెంటిమెంట్ ను ఆయన బ్రేక్ చేయగలడా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
తెలుగు సినీ పరిశ్రమతో పాటు దేశ వ్యాప్తంగా అంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సినిమా రాజమౌళి , మహేష్ బాబు సినిమా. ఈ పాన్ వరల్డ్ మూవీని ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ ‘దుర్గా ఆర్ట్స్’ పతాకంపై రూపొందిస్తున్నారు.
దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు సమాచారం. అమెజాన్ అడవిలో జరిగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో లేదా 2027 ప్రారంభంలో అయినా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాతో మహేష్ బాబు హాలీవుడ్ ప్రయాణం ప్రారంభమవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఎంత పెద్ద హీరో అయినా ప్లాప్ చూడక తప్పదు.ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఇలా హీరోలకు వచ్చిన ఫ్లాప్ ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకుంటే మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మరి మహేష్ నెక్ట్స్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు.?
తాజా సమాచారం మేరకు మహేష్ బాబు తన 30వ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, ఆ చిత్రానికి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఈసారి ఎలాగైనా హిట్ ఇవ్వాలనే లక్ష్యంతో సుకుమార్ కథ సిద్ధం చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మరోవైపు ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి హిట్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా కూడా మహేష్ బాబుతో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో 'యానిమల్' కథను మహేష్కు వినిపించగా, ఆ పాత్ర తన వ్యక్తిత్వానికి అనుకూలంగా లేదని రిజెక్ట్ చేశాడట మహేష్. ఇప్పుడు స్పిరిట్ , యానిమల్ పార్ట్ 2 పూర్తయిన తర్వాత మహేష్ కోసం మరో కొత్త కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సుకుమార్ - సందీప్ రెడ్డి వంగా – ఈ ఇద్దరి దర్శకులలో ఎవరితో మహేష్ 30వ సినిమాను ఖరారు చేస్తారన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. నిర్మాతలతో చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వచ్చే వారాల్లో వెలువడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.