Asianet News TeluguAsianet News Telugu

Samantha : గోవాలో వాళ్ళిద్దరితో సమంత!

సమంత రూత్ ప్రభు(Samantha) తాజాగా గోవాలో ప్రత్యక్షమయ్యింది. తనకు ఇష్టమైన వ్యక్తుల మధ్యలో కూర్చొని ఫోటోలకు స్మైల్ ఇచ్చింది సమంత. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా ఫోటోలు వైరల్ గా మారాయి.


 

heroin samantha off to goa participates in iffi
Author
Hyderabad, First Published Nov 22, 2021, 11:32 AM IST

గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మొదలైంది. ఈ అంతర్జాతీయ వేడుకలో సమంత పాల్గొంటున్నారు . సమంత ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రఖ్యాత వేదికపై ఆమె మాట్లాడనున్నారు. ఈ వేదికపై గళం విప్పనున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ గా సమంత రికార్డులకు ఎక్కనున్నారు. iffi వేదికపై మాట్లాడే అరుదైన గౌరవం సమంతకు సౌత్ ఇండియా నుండి దక్కింది. ఈ వేడుకకు ది ఫ్యామిలీ మాన్ సిరీస్ తో సూపర్ పాప్యులర్ అయిన దర్శక ద్వయం రాజ్&డీకే సైతం పాల్గొన్నారు. 

వేడుకలో వారిద్దరి మధ్యలో సమంత కూర్చున్నారు. సదరు ఫోటోను సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ది ఫ్యామిలీ మాన్ 2 లో సమంత ప్రధాన రోల్ చేసిన విషయం తెలిసిందే. తమిళ లేడీ రెబల్ గా సమంత సీరియస్ రోల్ లో అద్భుతంగా నటించారు. మొదటిసారి యాక్షన్ సన్నివేశాలలో పాల్గొన్నారు. ఆమెపై కొన్ని బోల్డ్ సన్నివేశాలు కూడా తెరకెక్కించారు. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సూపర్ సక్సెస్ కావడం జరిగింది. ఆ పరిచయంతో వారిద్దరితో సమంత జాయిన్ అయ్యారు. 

Also read Samantha: ఆలోచించడానికి హద్దులేవ్, పద్దతిగా ఉండాల్సిన పనీలేదు... సమంతను బోల్డ్ గా మార్చేసిన వివాదాస్పద డిజైనర్
ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సమంతకు బాలీవుడ్ లో ఇమేజ్ తెచ్చిపెట్టింది. దానితో ఆమెకు అక్కడ ఆఫర్స్ క్యూ కడుతున్నట్లు సమాచారం. ఇక సౌత్ భాషలో వరుసగా ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు సమంత. ప్రస్తుతం నయనతారతో ఆమె చేస్తున్న బైలింగ్వెల్ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక పుష్ప మూవీలో ఐటెం నంబర్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సాంగ్ షూట్ లో సమంత పాల్గొనాల్సి ఉంది. ఐదు రోజుల షూట్ జరగనుండగా, సమంత కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తల వినిపిస్తున్నాయి. 

Also read Kajal aggarwal; థర్టీ సిక్స్ ఏజ్ లో స్వీట్ సిక్స్టీన్ లుక్... సూపర్ స్లిమ్ గా కిరాక్ పుట్టిస్తున్న కాజల్
ఇక విడాకుల డిప్రెషన్ నుండి సమంత బయటపడ్డట్లు కనిపిస్తుంది ఆమె తన ప్రొఫెషన్ లో బిజీ కావడం జరిగింది. ఇక సమంత నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం శాకుంతలం(Shakunthalam) పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.  పౌరాణిక చిత్రంగా తెరకెక్కుతుండగా, అల్లు అర్జున్ కూతురు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios