Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంక యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం కేసుః పోలీసుల ఎదుట హాజరైన హీరో ఆర్య

తనని పెళ్లి చేసుకుంటానని ఆర్య నమ్మించి మోసం చేశాడని, శ్రీలంకకి చెందిన ఓ యువతి విద్జా కోర్టు మెట్లెక్కింది. దీంతో ఆర్య పోలీసు విచారణకు హాజరయ్యారు.

hero arya attend chennai police commissioner office for investigate
Author
Hyderabad, First Published Aug 11, 2021, 2:06 PM IST

చెన్నైః ఇటీవల `సార్పట్ట` చిత్రంతో సక్సెస్‌ అందుకున్నాడు హీరో ఆర్య. అదే రోజు తనకు పండంటి ఆడబిడ్డ పుట్టాడు. ఈ రెండు ఆనందాల్లో ఉన్న ఆర్యకి ఉన్నట్టుండి బిగ్‌ షాక్‌ తగిలింది. తనని పెళ్లి చేసుకుంటానని ఆర్య నమ్మించి మోసం చేశాడని, శ్రీలంకకి చెందిన ఓ యువతి విద్జా కోర్టు మెట్లెక్కింది. ఆర్య తనని మ్యారేజ్‌ చేసుకుంటానని, తన నుంచి రూ.70లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దీంతోపాటు ఆమె ఆర్యతో చేసిన చాటింగ్‌ కి సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్‌ ఫోటోలను కూడా విడుదల చేసింది. ఆమె ఫిర్యాదుని స్వీకరించి కోర్ట్ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో కోర్ట్ దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, తగిన ఆధారాలను సేకరించాలని, మరిన్ని విషయాలను తెలుసుకోవాలని కోర్ట్ చెన్నై పోలీసులను ఆదేశించింది. కేసు విచారణ ఆగస్ట్ 17కి వాయిదా వేసింది. ఇందులో భాగంగా  తమిళనాడులోని చెన్నైలోగల పోలీసు కమిషనర్‌ ఎదుట మంగళవారం ఆర్య విచారన నిమిత్తం హాజరయ్యారు. దాదాపు మూడు గంటలపాటు ఆయన్ని పోలీసులు విచారించినట్టు తెలుస్తుంది. 

ఆర్య `వరుడు`, `సైజ్‌ జీరో` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్ఆయడు.  ఇప్పుడు ఆయన విశాల్‌తో `ఎనిమి` చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే నటి సాయేషాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2019లో వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకోగా గత నెలలో వీరికి కుమార్తె జన్మించింది.

Follow Us:
Download App:
  • android
  • ios