మెగాస్టార్‌ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. నాగార్జున దారిలోనే తాను కూడా వెళ్లబోతున్నట్టు తెలిపారు. అలాంటి పాత్రలు చేసేందుకు రెడీ అని వెల్లడించారు. 

సీనియర్‌ హీరోలు ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూ, అవకాశం వచ్చినప్పుడు ఇతర హీరోల సినిమాల్లో బలమైన పాత్రలు చేయడానికి వెనకడుగు వేయడం లేదు. వెంకటేష్‌ అదే దారిలో వెళ్తున్నారు. 

హీరోగా చేస్తూనే మల్టీస్టారర్‌ మూవీస్‌ చేస్తున్నారు. విజయాలు అందుకుంటున్నారు. కమల్‌ హాసన్‌ చాలా కాలంగా చేసుకుంటూ వస్తున్నారు. `కల్కి 2898 ఏడీ`లో అలాంటి పాత్రనే చేశారు. ఇప్పుడు `కుబేర`తో నాగార్జున టర్న్ తీసుకున్నారు. 

ఈ మూవీలో దీపక్‌ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. `కూలీ`లోనూ నటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు చిరంజీవి కూడా ఈ దారిలోకి రాబోతున్నట్టు ప్రకటించారు.

 `కుబేర` సక్సెస్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, నాగార్జున దారిలోను తాను కూడా రావచ్చు అని తెలిపారు. రేపొద్దున్న ఇలాంటి బలమైన పాత్రలు, డిఫరెంట్‌ రోల్స్ వస్తే ఓటీటీలకుగానూ, సినిమాల్లోనూ నటించే అవకాశం ఉంది. తాను కూడా నటించొచ్చు అని తెలిపారు చిరంజీవి.

నాగార్జున దారిలోనే నేను కూడా రావచ్చుః చిరంజీవి 

`నేను నాగార్జునని అన్ని విషయాల్లో స్ఫూర్తిగా తీసుకుంటాను. గ్లామర్‌ విషయంలోనూ, ఫిట్‌ నెస్‌ విషయంలో, కూల్‌గా ఉండే విషయంలో, ఏ విషయాన్ని కూల్‌గా డీల్‌ చేసే విషయంలో స్ఫూర్తి పొందుతాను. మాకు ఆయన కెప్టెన్‌లాంటి వారు, ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేసే విషయంలోనే నాగార్జుననే స్ఫూర్తి` అని తెలిపారు చిరంజీవి. 

`కుబేర` సక్సెస్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చిన చిరంజీవి ఈ విషయాలను వెల్లడించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, `నాగార్జునని ఈ సినిమాకు ముందు ఒకసారి కలిశారు. `కుబేర` గురించి అడిగినప్పుడు ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. 

ధనుష్ లీడ్ క్యారెక్టర్ అని చేశారని తెలిపాడు. ఎలా ఒప్పుకున్నావు అని అడిగాను. నాకు ఎక్కడో డిఫరెంట్ గా చేయాలని ఉంది. కొత్త గేట్స్ ఓపెన్ చేయాలనిపిస్తుంది. అలా ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పారు.

 నేను సినిమా చూశాను. ఆయన చెప్పినది 100% కరెక్ట్. ఈ సినిమా తర్వాత తను మరో 40 ఏళ్లు అద్భుతంగా రాణిస్తారనేది వాస్తవం. ఈ క్యారెక్టర్ శేఖర్ రాయడం, అది నాగార్జున ఒప్పుకొని చేయడం, ఇదే ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నా` అని అన్నారు చిరు.

ధనుష్‌కి జాతీయ అవార్డు రావాల్సిందే

ఆయన ఇంకా మాట్లాడుతూ, `ఇది నా సక్సెస్ మీట్ లా అనిపిస్తుంది. అలాంటి ఆనందాన్ని ఇక్కడ పొందుతున్నాను. ఇక్కడకి నేను గెస్ట్ గా రాలేదు. మీలో ఒకడిగా, ఆత్మీయుడుగా వచ్చాను. దేవ క్యారెక్టర్ లో ధనుష్‌ ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం.

 ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత అలా అనిపించింది. సినిమా చూస్తున్నప్పుడు ధనుష్ ని గుర్తించలేకపోయాను. అంతలా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ సినిమాలో హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ దేవ. ఈ క్యారెక్టర్ కి ధనుష్ తప్ప ఇంకెవరూ చేయలేరు. 

అంత స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇండియాలో ధనుష్ ఒక్కరే. అంత నేచురల్ గా క్యారెక్టర్ లో ఇమిడిపోయారు. ఈ సినిమాతో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి. 

తనకు అడ్వాన్స్ కంగ్రాజులేషన్స్ చెప్తున్నాను. ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు. తనకి ఈ సినిమాకి అవార్డు వస్తే కనుక ప్రతి ఒక్కరికి గర్వకారణం.

`స్టేట్‌ రౌడీ` సమయంలో ఫస్ట్ టైమ్‌ శేఖర్‌ కమ్ముల కలిశాడు

ఈ సినిమాని ఒక సినిమాలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లా చూశాను. వాస్తవంగా జరుగుతున్నట్టుగా అనిపించింది. ఒక్కొక్క సినిమాని ఆణిముత్యం లాగా చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పర్చుకున్నా శేఖర్ కమ్ముల.. `స్టేట్ రౌడీ` షూటింగ్ జరుగుతున్నప్పుడు నన్ను ఓ అభిమానిలా కలిశారు. 

ఆరోజే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ఇలాంటి ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీసి ప్రేక్షకుల మన్ననలని పొందుతున్న దర్శకుడిగా ఆయన ఉండడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. 

ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఆయనకి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. శేఖర్ కమ్ముల సినిమాలో వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాల పాత్రలు కూడా దేవ, దీపక్ అనే గుర్తు పెట్టుకుంటాం. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది.

రష్మిక మందన్నాని చూస్తే సౌందర్య గుర్తొచ్చింది

రష్మిక ఫెంటాస్టిక్ గా పర్‌ ఫెర్మ్ చేసింది. తన ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు నేను గెస్ట్ గా వచ్చాను. తను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది. తన క్యారెక్టర్ లో ఇంటెన్సిటీ ఈ సినిమాలో కనిపించింది. 

సమీరా క్యారెక్టర్ చూసినప్పుడు `చూడాలని ఉంది`లో సౌందర్య గుర్తుకొచ్చింది. ఈ సినిమా మొత్తంలో తన క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. సునీల్ నాన్నగారు నారాయణ దాస్ చాలా హానెస్ట్ పర్సన్. 

ఈ సినిమా బిజినెస్ లో అంత నిజాయితీగా ఉండే వ్యక్తులు మరొకరు లేరు. ఆయన వారసులుగా సునీల్, థర్డ్ జనరేషన్ లో జాన్వి ముందుకు వెళ్లడం అనేది చాలా ఆనందంగా ఉంది. జాన్వి తో ఒక సినిమా చేస్తాను(నవ్వుతూ)` అని వెల్లడంచారు చిరంజీవి.

`నీరు నీరు` పాటని మరిపించేలా అమ్మ పాట

చిరంజీవి టీమ్‌ గురించి చెబుతూ, కెమెరామెన్‌ నికేత్ ఫెంటాస్టిక్ జాబ్. సినిమా చాలా రిచ్ గా ఉంది. ఇక్కడ యువతని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలంటే ఇలాంటి యువత ముందుకు రావాలి. కొత్త టాలెంట్‌ రావాలి. 

ఇదే ఎనర్జీతో ఇండస్ట్రీ కళకళలాడాలని కోరుకుంటున్నాను. దేవిశ్రీప్రసాద్ నా బిడ్డ లాంటివాడు. నా కమ్‌ బ్యాక్ మూవీ `ఖైదీ నెంబర్‌ 150`లో కూడా అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చాడు. తన ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది. దేశం మొత్తం తనని కీర్తిస్తోంది. సినిమా చాలా మ్యూజికల్ గా ఉంది. 

అది దేవిశ్రీ రికార్డింగ్ లో అద్భుతం చేశాడు. ఇందులో తల్లి మీద పాడిన పాట `ఖైదీ నెంబర్‌ 150`లో `నీరు నీరు` పాటని మైమరిపించే లాగా అనిపించింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను. 

ఇలాంటి సినిమాలు రావాలి. థియేటర్స్ కి ఆడియన్స్ రప్పించడం గగనం అయిపోతున్న రోజులు ఇవి. ఇలాంటి సమయంలో కంటెంట్ వుంటే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారని భరోసా కల్పించిన సినిమా ఇది.

ఈ క్రెడిట్ శేఖర్ కమ్ములకే దొరుకుతుంది. కంటెంట్ బాగుంటే హ్యూమన్ ఎమోషన్స్ ని టచ్ చేయగలిగితే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారని `కుబేర` సినిమా నిరూపించింది` అని తెలిపారు చిరంజీవి.

చిరంజీవిని అందుకే అందరు ప్రేమిస్తారుః నాగార్జున

చిరంజీవి గురించి నాగార్జున చెబుతూ, `మై బ్రదర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్యూ. ఇండస్ట్రీ అంతా చిరంజీవిని ఎంతగానో ప్రేమిస్తుంది. `విక్రమ్` సినిమా పెద్ద హిట్ అయినప్పుడు కమల్ ఇక్కడికి వచ్చారు. ఆయన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించారు. 

అమీర్ ఖాన్ హిందీ మూవీ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సినిమాని పక్కనుండి సపోర్ట్ చేశారు. చిన్న సినిమా పెద్ద సినిమా ఏదైనా కావచ్చు.. సపోర్ట్ చేయడానికి చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారు, ప్రేమిస్తారు. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది` అని చెప్పారు నాగ్‌.