టీ20 వరల్డ్కప్ 2021: వార్మప్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం... కెఎల్ రాహుల్ క్లాస్, ఇషాన్ కిషన్ మాస్...
19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు... కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు... విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత జట్టు మంచి విజయాన్ని అందుకుంది. భారీ లక్ష్యఛేదనలో ఎక్కడ తడబడకుండా అదరగొట్టింది... 189 పరుగుల భారీ టార్గెట్తో బరిలో దిగిన టీమిండియాకి ఓపెనర్లు కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. ఓవర్కి 10 పరుగుల చొప్పున స్కోర్ చేస్తూ 8.2 ఓవర్లలోనే తొలి వికెట్కి 82 పరుగుల భాగస్వామ్యం అందించారు.
ఐపీఎల్ ఫామ్ని కొనసాగిస్తూ 24 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మార్క్ వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు... ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం మరోసారి నిరాశపరిచాడు. 13 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ, లివింగ్స్టోన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు...
Must Read: టీ20 వరల్డ్కప్ 2021: రద్దు దిశగా భారత్, పాక్ మ్యాచ్?... కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్లతో...
46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ప్రాక్టీస్ చాలంటూ రిటైర్ హర్ట్గా పెవిలియన్ చేరగా సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లో ఓ ఫోర్తో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత రిషబ్ పంత్ 14 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 29 పరుగులు, హార్ధిక్ పాండ్యా 10 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి మ్యాచ్ను ముగించారు. క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్లో రెండు నో బాల్స్తో 23 పరుగులు రాబట్టారు హార్ధిక్, రిషబ్ పంత్...
ఇవీ చదవండి: t20 worldcup 2021: మొదటి మ్యాచ్లో శ్రీలంక ఘన విజయం... నమీబియాను చిత్తు చేసి...
INDvsENG వార్మప్ మ్యాచ్: భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్... మూడు వికెట్లు తీసిన మహ్మద్ షమీ...
ధోనీ కింద పడుకుని, నాకు తన బెడ్ ఇచ్చాడు, మాహీయే నా లైఫ్ కోచ్... - హార్దిక్ పాండ్యా...