userpic
user icon
0 Min read

India Pakistan War: ఐపీఎల్ 2025 ర‌ద్ద‌వుతుందా?

India Pakistan: IPL 2025 at risk as India Pakistan conflict halts IPL in telugu rma
India Pakistan: IPL 2025 at risk as India Pakistan conflict halts IPL

Synopsis

India Pakistan War: ఇండో-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 కొనసాగింపు పై అనిశ్చితి నెలకొంది. ధర్మశాలలో మ్యాచ్ మధ్యలో నిలిపివేశారు. దీంతో ఐపీఎల్ జరుగుతుందా? లేదా మొత్తానికే రద్దు చేస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. 

India Pakistan War IPL 2025: ఇండియా-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. IPL చైర్మన్ అరుణ్ ధూమల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన తరువాతే లీగ్ కొనసాగింపు పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

గురువారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ మధ్యలో నిలిపివేశారు.  పాకిస్తాన్ భారత్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన తరువాత, ధర్మశాలా నగరంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచ్‌ను నిలిపివేసి, ఆటగాళ్లను, ప్రేక్షకులను సురక్షితంగా ఖాళీ చేయించారని హెచ్పీసీఏ (HPCA) వర్గాలు తెలిపాయి.

పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు జమ్ము, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ దాడిని విజయవంతంగా తిప్పికొట్టిందని పేర్కొంది. దీంతో పలు పట్టణాల్లో హెచ్చరిక సైరన్లు మోగాయి, విద్యుత్‌ను నిలిపివేశారు.

ఈ దాడి పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ప్రారంభించిన 'ఆపరేషన్ సిందూర్' కు ప్రతిగా పాకిస్తాన్ చర్యగా అభిప్రాయపడుతున్నారు. భారత సైన్యం అప్పట్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్ర శిబిరాలపై లక్ష్య దాడులు నిర్వహించింది.

IPL మ్యాచ్‌కు హాజరైన విదేశీ ఆటగాళ్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. లీగ్ కొనసాగాలంటే భారత క్రికెట్ బోర్డు (BCCI), కేంద్ర ప్రభుత్వాల నుంచి భద్రతా హామీలు అవసరమవుతాయని తెలుస్తోంది. ధర్మశాలాలో ఉన్న అన్ని జట్లను, సిబ్బందిని ప్రత్యేక రైలు ద్వారా శుక్రవారం (మే 9) తరలించనున్నారు.

ప్రస్తుతం IPL గవర్నింగ్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఎటువంటి IPL స్థలానికి ప్రత్యక్ష బెదిరింపు లేనప్పటికీ, దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని లీగ్ తాత్కాలికంగా నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది.

ఢిల్లీ కాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లను ఇప్పటికే బంకర్లకు తరలించారు. శుక్రవారం లక్నోలో జరగాల్సిన లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ పై ఇంకా స్పష్టత లేదు. గుజరాత్ టైటాన్స్ జట్టు మే 11న ఢిల్లీలో డీసీతో జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికే ఢిల్లీకి చేరింది. ముంబై ఇండియన్స్ కూడా అదే రోజు అహ్మదాబాద్ చేరుకోనుంది. దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో IPL 2025 కొనసాగుతుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం త్వరలో వెల్లడికావచ్చు. BCCI ప్రభుత్వం సూచనల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది.

Download App

Latest Videos