గూగుల్ పే, ఫోన్ పే లా త్వరలో మనం ఎక్స్ మనీ పేమెంట్ కూడా చేయబోతున్నాం. ఎక్స్ యాప్ (ట్విట్టర్) త్వరలోనే ఈ డిజిటల్ చెల్లింపుల సేవను ప్రారంభించనుంది.

ఎలాన్ మస్క్ చేతికొచ్చాక ఎక్స్ గా పేరు మారిన ఒకప్పటి ట్విట్టర్.. డిజిటల్ చెల్లింపుల సేవను త్వరలోనే ప్రారంభించనుంది. గూగుల్ పే, ఫోన్ పే లా దీన్ని 'ఎక్స్ మనీ' అని పిలుస్తున్నారు. ఈ సేవ అందుబాటులోకి వస్తే వాట్సాప్ పేమెంట్స్‌కు గట్టి పోటీనివ్వనుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సేవ ద్వారా యూజర్లు ఎక్స్ యాప్ ద్వారానే చెల్లింపులు, బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించవచ్చు.

డిజిటల్ చెల్లింపుల సేవ పేరు ఎక్స్ మనీ..

ఎక్స్ యాప్ తన తొలి డిజిటల్ చెల్లింపుల సేవ 'ఎక్స్ మనీ'ని ప్రారంభించనుంది. ఎక్స్ యాప్ బీటా వెర్షన్ విడుదల తర్వాత అందరికీ ఎక్స్ మనీ అందుబాటులోకి వస్తుంది. యూజర్ల డబ్బుకు భద్రత ముఖ్యమని, అందుకే జాగ్రత్తగా ఈ సేవను ప్రారంభిస్తున్నామని ఎలాన్ మస్క్ తెలిపారు. 

2022లోనే ప్లాన్ స్టార్ట్ చేశారు..

2022లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసి ఎక్స్‌గా మార్చినప్పటి నుండే మస్క్ ఈ సేవ గురించి హింట్స్ ఇస్తున్నారు. ఈ సేవ ద్వారా యూజర్లు సులభంగా డబ్బులు పంపించుకోవచ్చు. స్వీకరించవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఇలాంటి సేవ ఉంది.

ఎక్స్ మనీలో క్రిప్టోకరెన్సీ చెల్లింపుల సదుపాయం ఉండవచ్చని సమాచారం. బిట్‌కాయిన్ ద్వారా చెల్లింపులు జరపవచ్చని అంచనా. సులభతరమైన చెల్లింపుల కోసం వీసాతో కలిసి పనిచేయాలని ఎక్స్ యోచిస్తోంది.

ఎక్స్ - 'ఎవ్రీథింగ్ యాప్'

ఎక్స్‌ను అన్ని రకాల సేవలు కలిగిన 'ఎవ్రీథింగ్ యాప్'గా మార్చాలని మస్క్ కోరుకుంటున్నారు. మైక్రోబ్లాగింగ్, మెసేజింగ్‌తో పాటు వ్యాపార వేదికగానూ ఎక్స్‌ను మారుస్తున్నారు. 2022 నుండి ఎక్స్‌లో చాలా మార్పులు చేశారు. సబ్‌స్క్రిప్షన్ ద్వారా వెరిఫికేషన్, కంటెంట్ క్రియేటర్స్ కోసం మానిటైజేషన్ సదుపాయాలు కల్పించారు. 

2026 లో ఎక్స్ మనీ ప్రారంభం

ఎక్స్ మనీని అమెరికాలో ప్రారంభించే ముందు 50 రాష్ట్రాల నుండి అనుమతులు తీసుకోవాలని మస్క్ భావిస్తున్నారు. 2026 నాటికి అమెరికాలో ఎక్స్ మనీ అందుబాటులోకి రావచ్చు.