Budget 2020:బడ్జెట్ సూట్కేస్ వాడకంలో ట్రెండ్ మార్చిన నిర్మల’మ్మ...మరి ఈసారెలా ?!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దాదాపు దేశ ప్రజలంతే దీని గురించే చర్చించుకుంటున్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. సామాన్యులకు ఎలాంటి వరాలు కురిపించనుంది? రైతుల కోసం ఏం చేస్తుంది? వంటి ప్రశ్నలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఆర్థికశాఖ మంత్రి చేతిలోని సూట్కేసే.
న్యూఢిల్లీ: బీజేపీ నేత నరేంద్రమోదీ సారథ్యంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం శనివారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. గతేడాది జూలైలో సూట్కేసు సంప్రదాయానికి చెక్ పెట్టి, ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ఎలా వస్తారని ఆసక్తి నెలకొంది.
బడ్జెట్ ప్రతులు తెచ్చే ఈ సూట్కేస్కు ఓ చరిత్ర ఉందని తెలుసా? ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? కాలక్రమేణా రంగులు, పరిమాణంలో మార్పుల గురించి విన్నారా? అసలు ఈ బడ్జెట్కు, లెదర్ సూట్ కేసుకు సంబంధం ఏమిటో తెలుసుకుందాం..భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షన్ముఖం శెట్టి 1947లో లెదర్ బ్యాగ్ వినియోగించారు.1956-58, 1964-66 సమయంలో ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి ఫైల్ బ్యాగ్తో పార్లమెంటులో అడుగుపెట్టారు.1958లో జవహర్లాల్ నెహ్రూ నలుపు రంగు బ్రీఫ్కేసు వాడారు.
also read Budget 2020: ఆర్థిక సర్వే హైలేట్స్... రైతు పంట రుణాలతో నెగెటివ్ ఫలితాలు...
1998-99లో నాటి వాజపేయి సర్కార్లో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఎరుపు రంగుకు దగ్గరగా ఉన్న బడ్జెట్ బాక్స్తో పార్లమెంట్కు వచ్చారు. ఇక దేశానికి సంస్కరణలను పరిచయం చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు మార్గనిర్దేశం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా 1991-92లో తొలిసారి బ్రిటన్ తొలి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్స్టోన్ వినియోగించిన బ్రీఫ్కేస్ను పోలిన నలుపు రంగు బ్యాగ్ వాడారు.
ప్రస్తుత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందరిలా కాకుండా చెర్రీ ఎరుపు రంగు సూట్కేసులో బడ్జెట్ పత్రాలను పార్లమెంటుకు తీసుకు వచ్చి ప్రత్యేకంగా నిలిచారు. బ్రిటన్ మాజీ ప్రధాని గ్లాడ్స్టోన్ తరహాలో సాదా గోధుమ రంగు, ముదురు గోధుమ రంగు బ్రీఫ్కేసుల్ని వినియోగించారు చిదంబరం.
also read Budget 2020:పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మల...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో తొలివిడుత ఎన్డీఏ సర్కార్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ జైట్లీ మొదటి రెండు సంవత్సరాలు గోధుమ రంగు, లేత గోధుమ రంగు బ్యాగ్లు వాడారు. 2017లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముదురు గోధుమ రంగు బ్యాగ్ వాడారు. ఇదిలా ఉంటే అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ చికిత్స కోసం అమెరికా వెళ్లడంతో 2019 ఎన్నికల ముందు ఆర్థిక మంత్రి హోదాలో పీయూష్ గోయల్ ఎరుపు రంగు సూట్కేసుతో పార్లమెంట్లోకి అడుగుపెట్టారు.
గతేడాది ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక జులై 5న బడ్జెట్ సమయంలో సూట్కేసుతో పార్లమెంటుకు వచ్చే సంప్రదాయానికి చెక్ పెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక శాఖ ప్రముఖులతో కలిసి ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు. తాజాగా శనివారం నిర్మలా సీతారామన్ తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మళ్లీ ఆమె ఏ రకంగా పార్లమెంటులో అడుగుపెడుతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.