తాజాగా రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఈటెల రాజేందర్... తాను పీసీసీ అధ్యక్షుడవకముందు బీజేపీలో చేరాడని, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అని అనడమే కాకుండా ఓపెన్ ఇన్విటేషన్ కూడా ఇచ్చారు.
2019 పార్లమెంటు ఎన్నికల్లో ఒకింత మెరుగైన ప్రదర్శనను చేసిన కాంగ్రెస్... ఆ తరువాతి నుంచి రాష్ట్రంలో పూర్తిగా ప్రభావాన్ని కోల్పోయింది. నాయకత్వ లేమి, నాయకుల మధ్య సమన్వయ లోపం అన్ని వెరసి తెలంగాణలో తెరాస కు ప్రత్యామ్నాయం తామే అనే పరిస్థితికి బీజేపీ వచ్చింది.
ఈటెల అంకం మొదలవగానే రాష్ట్రంలోని మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెరాస లో ఇమడలేక బయటకు వెళదామనుకునే వారికి బీజేపీ మాత్రమే అవకాశంగా కనబడుతుంది.
తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్న సంకేతాలు ఈటెల చేరికతో జనాల్లోకి నెమ్మదిగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారట.
మిగిలిన రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించడం వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదని, అందుకని తెలంగాణాలో లాక్ డౌన్ విధించబోవడంలేదు అని ప్రకటించిన రెండు రోజులకే లాక్ డౌన్ ప్రకటన వచ్చింది. ఉన్నపళంగా ప్రభుత్వం ఎందుకు లాక్ డౌన్ కి పూనుకుందనే విషయం ఇప్పుడు అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న.
ఈటెల నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏమిటి అని అంతా చర్చించుకుంటున్నారు. ఆయన రాజీనామా చేయడం మాత్రం పక్కా అని తేల్చి చెప్పారు. అది నేడా, రేపా అనేదే తేలాలి.
అసలు కేసీఆర్ కి, ఈటలకు మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనే విషయం ఇప్పటికీ ఇంకా ఎవరికీ అంతుబట్టడం లేదు.
ఈటలను వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతల నుంచి తప్పించి స్వయంగా ఆ శాఖను కేసీఆర్ తనకు బదలాయించుకున్నారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూస్తుంటే ఇందులో ఒక రాజకీయ ఎత్తుగడే ఉన్నట్టుగా కనబడుతుంది.
ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనపై ఆదేశించిన విచారణ విపక్షాలకు కొత్త అస్త్రం అయ్యేలా కనబడుతుంది.
ప్రెస్ మీట్ లో ఈటల తెలంగాణ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా మాట్లాడారు.ఈ విషయాల కన్నా కూడా ప్రెస్ మీట్ లో ఆయన ఎత్తుకున్న బీసీ కార్డు భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసేదిలా కనబడుతుంది.