
Weather Update: మండే భగభగలు.. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకీ తీవ్రంగా మారుతున్నాయి. ‘మండే’ భగభగలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లవద్దని సూచనలు ఇస్తున్నారు. ఈ వీడియోలో ఎక్కడ ఎంత ఉష్ణోగ్రత నమోదైందో, రాబోయే రోజుల వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.