కలిసి ఆడుకుందామని చెప్పి... ఏడేళ్ల బాలికను గుడిలోకి తీసుకెళ్లి..
విశాఖ జిల్లాలో దారుణం జరిగింది.. ఏడేళ్ల బాలికపై 8,9 తరగతుల విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు.ఇద్దరు బాలురు వచ్చి ఆమెతో మాట్లాడారు.. గుడి దగ్గర కలిసి ఆడుకుందామని చెప్పి.. ఆమెను ఆలయంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
విశాఖ జిల్లాలో దారుణం జరిగింది.. ఏడేళ్ల బాలికపై 8,9 తరగతుల విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. పద్మనాభం మండలం కృష్ణాపురం ఎస్సీ కాలనీకి చెందిన ఏడేళ్ల బాలిక ఈ నెల 2న సాయంత్రం కాలనీలో నిర్మాణంలో ఉన్న రామాలయం సమీపంలో ఆడుకుంటోంది.
అదే సమయంలో.. అదే కాలనీకి చెందిన ఇద్దరు బాలురు వచ్చి ఆమెతో మాట్లాడారు.. గుడి దగ్గర కలిసి ఆడుకుందామని చెప్పి.. ఆమెను ఆలయంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిన బాలిక జరిగిన దారుణాన్ని తన తల్లికి చెప్పడంతో.. తల్లిదండ్రులు విషయాన్ని కుల పెద్దల దృష్టికి తీసుకెళ్లగా.. వారు పంచాయతీ పెట్టి, ఇరు పక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు.
దీనిని బాలిక తల్లి వ్యతిరేకించి.. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణాపురం చేరుకుని.. వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అత్యాచారానికి గురైన బాలిక రెండో తరగతి చదువుతుండగా.. నిందితులైన ఇద్దరు విద్యార్థులు 8, 9 తరగతులు చదువుతున్నారు.
దారుణం: ఐసీయూలో మైనర్పై గ్యాంగ్ రేప్
మైనర్పై 8 మంది గ్యాంగ్ రేప్: బెదిరింపు, బాధితురాలిలా..
బాలికపై అత్యాచారం..యువకుడికి పదేళ్ల జైలు శిక్ష
కుటుంబ సభ్యులను కొట్టి, కట్టేసి బాలికపై గ్యాంగ్ రేప్
బాలికపై ఆస్పత్రి సిబ్బంది గ్యాంగ్రేప్...కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరితే
ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. కామాంధుడికి ఉరిశిక్ష
గుడిలో బాలికపై అత్యాచారం.. పూజారులే నిందితులు
బాలికను గర్భవతిని చేసి.. పెళ్లి చేసుకుంటానని.. ఆత్మహత్య చేసుకున్నాడు
భక్తులతో కిక్కిరిసిన గణేశ్ మండపం.. మండపం వెనుక బాలికపై అత్యాచారం
బాలికను తల్లిని చేసిన ప్రిన్సిపాల్..అత్యాచారాన్ని వీడియో తీసి 9 నెలలుగా