ఏపీ రాష్ట్రంలో  భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేసేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ నెల 22న ఢిల్లీకి వెళ్లనున్నారు. 

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ ఈ నెల 22 వతేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అంతేకాదు అమరావతి విషయంలో ఈ రెండు పార్టీలు భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేయనున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also read:అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్

ఈ నెల 21 వ తేదీన బీజేపీ ముఖ్య నేతల సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు ఏపీ రాష్ట్ర రాజకీయాలపై కీలకమైన తీర్మానం చేయనున్నారు. ఈ సమావేశం తర్వాత ఈ నెల 22వతేదీన జనసేన, బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏపీ రాష్ట్రంలో భవిష్యత్తులో చేయాల్సిన కార్యాచరణను సిద్దం చేయనున్నారు.

 Also read:జగన్‌కు షాక్: మండలిలో టీడీపీ నోటీసుపై చర్చకు అనుమతి

Also read:బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ

Also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన: హెడ్‌సెట్ తీసేసి కోపంగా వెళ్లిన స్పీకర్ తమ్మినేని

 ఇప్పటికే బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీలో మకాం వేశారు. ఏపీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు గాను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ లు కూడ ఢిల్లీకి వెళ్లనున్నారు.

also read:మండలిలో బిల్లు: 71 కింద చర్చకు పట్టు, టీడీపీ సభ్యుల గైర్జాజర్

Also read:ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు: కౌంటర్ వ్యూహాంతో టీడీపీ

ఈ నెల 22వ తేదీన ఈ రెండు పార్టీల నేతలు ఏపీ రాజకీయాలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.