- Home
- Andhra Pradesh
- పిల్లలు కాదు పిశాచాలు.. టీచర్పై దాడి చేసి పదో తరగతి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
పిల్లలు కాదు పిశాచాలు.. టీచర్పై దాడి చేసి పదో తరగతి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Andhra pradesh: పాఠశాలలు పిల్లలకు విద్య మాత్రమే కాదు, విలువలు నేర్పే స్థలాలు కూడా. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓ సంఘటన విద్యార్థుల్లో పెరుగుతోన్న వికృత ప్రవర్తనకు నిదర్శనంగా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..

చిన్న గొడవ పెద్ద సంఘటనగా మారింది
ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. సమాచారం ప్రకారం ఇద్దరు విద్యార్థుల మధ్య చిన్న వివాదం మొదలైంది. ఆ గొడవను ఆపడానికి ప్రయత్నించిన టీచర్ పరిస్థితిని సమాధానపరచాలని చూశాడు. అయితే ఈ సమయంలో మాటలు కాస్త గట్టిగా మారడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
టీచర్పై దాడి చేసిన పదో తరగతి విద్యార్థి
టీచర్ మాట్లాడిన మాటలు తన కుటుంబాన్ని అవమానించాయని భావించిన ఒక పదో తరగతి విద్యార్థి ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే ఆయనపై దాడికి దిగాడు. కోపంతో పిడిగుద్దులు కురిపించేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్న ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే మధ్యలోకి వచ్చి అడ్డుకున్నారు. “మా అమ్మను ఎందుకు తిడతారు?” అని ఆ విద్యార్థి ఆవేశంగా ప్రశ్నించినట్లు వీడియోలో వినిపిస్తోంది.
సిగరెట్ ఘటనతో ప్రారంభమైన వివాదం
ఈ సంఘటనకు ముందు మరో విషయం కూడా బయటకు వచ్చింది. బ్రేక్ టైమ్లో పాఠశాల మరుగుదొడ్ల దగ్గర ముగ్గురు విద్యార్థులు సిగరెట్ తాగుతున్నట్లు ల్యాబ్ అసిస్టెంట్ రవీంద్ర గమనించారు. వెంటనే వారిని మందలించారు. ఆ విషయాన్ని ప్రధానోపాధ్యాయునికి కూడా తెలియజేశారు. ఇదే విషయం విద్యార్థులకి ఆగ్రహాన్ని కలిగించిందని తెలుస్తోంది.
వీడియో తీసిన వారిపై కూడా ఆగ్రహం
వాగ్వాదం పెరిగిన తర్వాత కొంతమంది విద్యార్థులు రవీంద్రపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనను వీడియో తీస్తున్న వారిపై కూడా కొందరు విద్యార్థులు కోపం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉన్న ఉపాధ్యాయులు వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థులను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉపాధ్యాయులు వీరవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
"Heart wrenching." 💔⚠️
"Student brutally assaulted his teacher." 🚨
A Class 10 student from Andhra Pradesh mercilessly punched his teacher in the chest after being scolded over an issue.
The teacher can be seen crying in pain. Strict action should be taken. This is shameful. pic.twitter.com/Oxyif41EdM— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) March 6, 2026
విద్యార్థుల్లో పెరుగుతున్న ఆగ్రహ ధోరణి
ఈ సంఘటన ఒక్క పాఠశాలకే పరిమితం కాదు. ఇటీవలి కాలంలో కొంతమంది విద్యార్థుల్లో సహనం తగ్గి ఆవేశం పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చిన్న విషయాలకే కోపంతో స్పందించడం, పెద్దలను గౌరవించకపోవడం వంటి మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబం, పాఠశాల, సమాజం కలిసి పిల్లల్లో విలువలు, నియంత్రణ, పరస్పర గౌరవం పెంపొందించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

