Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుతో ముగిసిన భేటీ: పార్టీ మార్పుపై తేల్చని ఆమంచి

చంద్రబాబు తాను చెప్పిన విషయాలను సానుకూలంగా విన్నారని కృష్ణమోహన్ భేటీ తర్వాత మీడియాతో అన్నారు. తన అనుచరులతో, సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేనని అన్నారు

Amanchi not clarifies on his party change
Author
Amaravathi, First Published Feb 7, 2019, 2:37 PM IST

అమరావతి: తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతాడా, పార్టీ మారుతారా అనే విషయంపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అమంచి కృష్ణమోహన్ స్పష్టం చేయలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ తర్వాత కూడా ఆయన ఆయన ఏ విషయమూ తేల్చలేదు. 

చంద్రబాబు తాను చెప్పిన విషయాలను సానుకూలంగా విన్నారని కృష్ణమోహన్ భేటీ తర్వాత మీడియాతో అన్నారు. తన అనుచరులతో, సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేనని అన్నారు .

మొదట్లో తాను టీడీపితో ఘర్షణ పడ్డానని, ఆ తర్వాత టీడీపిలో చేరానని ఆయన చెప్పారు. చంద్రబాబుతో అన్ని విషయాలు చర్చించినట్లు ఆయన తెలిపారు. ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్దపడ్డారనే వార్తలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో ఆయనతో తొలుత మంత్రి శిద్ధా రాఘవరావు చర్చలు జరిపారు. ఆయన తర్వాత ఆమంచి చంద్రబాబును కలిసారు. తన నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలపై ఆయన చంద్రబాబుకు వివరించారు. 

సంబంధిత వార్తలు

పార్టీ మార్పు పుకార్లు:చంద్రబాబుతో ఆమంచి భేటీ

శిద్దాతో భేటీ: చంద్రబాబు భేటీ తర్వాతే ఆమంచి నిర్ణయం

సీన్ రివర్స్: చంద్రబాబుతో భేటీ కానున్న ఆమంచి

టీడీపీ బుజ్జగింపులు: ఆమంచి ఇంటికి మంత్రి శిద్దా రాఘవరావు

Follow Us:
Download App:
  • android
  • ios