MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Andhra Pradesh
  • Kakinada Blast : 18 మంది మృతి.. కాకినాడ పేలుడు వెనుక అసలు కారణం ఇదేనా?

Kakinada Blast : 18 మంది మృతి.. కాకినాడ పేలుడు వెనుక అసలు కారణం ఇదేనా?

Kakinada Blast : ఏపీలోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడులో 18 మంది కార్మికులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 28 2026, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
కాకినాడ జిల్లాలో పెను విషాదం: పేలుడు ధాటికి చెల్లాచెదురైన మృతదేహాలు
Image Credit : X/ddyadagirinews

కాకినాడ జిల్లాలో పెను విషాదం: పేలుడు ధాటికి చెల్లాచెదురైన మృతదేహాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో శనివారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం - జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న 'సూర్యశ్రీ ఫైర్ వర్క్స్' అనే బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మందుగుండు సామగ్రి తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఈ ఘోరం జరిగింది. పేలుడు ధాటికి మృతదేహాలు, శరీర భాగాలు సమీపంలోని పంట పొలాల్లోకి ఎగిరిపడటం అక్కడి భీతావహ పరిస్థితికి అద్దం పడుతోంది.

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు.. ఎగసిపడుతున్న మంటలు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సామర్లకోట, కాకినాడ నుంచి అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, తయారీ కేంద్రంలో భారీగా పేలుడు పదార్థాలు నిల్వ ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో సుమారు 20 నుంచి 30 మంది కార్మికులు లోపల ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. గాయపడిన ఐదుగురిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

#FireAccident | కాకినాడ జిల్లా సామర్లకోటలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా యూనిట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం, పలువురికి గాయాలు. ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా, తక్షణ సహాయక చర్యలకు ఆదేశం@NCBN#AndhraPradesh | #Kakinada |… pic.twitter.com/BDIPnAJ0RH

— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) February 28, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
స్పందించిన సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్
Image Credit : X/ddyadagirinews

స్పందించిన సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్

ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని హోం మంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాణాసంచా కేంద్రాల్లో భద్రతా ప్రమాణాల అమలుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

పునరావృతమవుతున్న ప్రమాదాలు.. గత చేదు జ్ఞాపకాలు

కాకినాడ జిల్లాలో బాణాసంచా కేంద్రాల్లో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2014లో వాకతిప్పలో జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, గత ఏడాది రాయవరంలో జరిగిన పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

Related image1
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
Related image2
IND vs WI: భారత్ vs వెస్టిండీస్ డూ ఆర్ డై మ్యాచ్ రద్దయితే సెమీస్ చేరేది ఎవరు?

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
నారా చంద్రబాబు నాయుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jogi Ramesh: రాజీవ్‌కు ఆ స‌మ‌స్య ఉంద‌ని తెలిసి మ‌రీ నా గొంతు కోశారు.. జోగి ర‌మేశ్ కోడ‌లు ఆవేద‌న
Recommended image2
Now Playing
AP Telangana Weather Alert: ఏపీ, తెలంగాణలో మరో 6 రోజులు దంచికొట్టనున్న వర్షాలు
Recommended image3
Now Playing
మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue
Related Stories
Recommended image1
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
Recommended image2
IND vs WI: భారత్ vs వెస్టిండీస్ డూ ఆర్ డై మ్యాచ్ రద్దయితే సెమీస్ చేరేది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved