మేడ్చల్ లో కాల్పులు కలకలం... తుపాకీతో బెదిరించి వైన్ షాప్ క్యాష్ దోపిడీ

Jan 24, 2023, 6:14 PM IST

మేడ్చల్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మేడ్చల్ జిల్లాలోని మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రి వద్ద గల వైన్ షాప్ కు గత రాత్రి మంకీ క్యాప్స్ ధరించి వచ్చిన ముగ్గురు దొంగలు కాల్పులకు తెగబడ్డారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు వైన్ షాప్ సిబ్బంది జైపాల్ రెడ్డి, బాలకృష్ణపై దాడికి దిగి రెండు లక్షల నగదు దోచుకెళ్లారు.