బీజేపీ నేతల అక్రమ అరెస్టులు కేసీఆర్ కుటుంబ పాలన పతనానికి శ్రీకారం: బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ చంద్రశేఖర్

Oct 26, 2020, 10:37 PM IST

తెలంగాణలో బీజేపీ నేతల అరెస్టులు అక్రమం, అప్రజాస్వామికమని ఆరోపించారు బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్. దుబ్బాక ఉపఎన్నికలో ప్రచారం చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులను చేయడం ద్వారా కేసీఆర్ సర్కార్ ఎంత బలహీనంగా ఉందొ అర్థమవుతుందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.