రిక్షా కార్మికుడి కూతురు పెళ్లికి మోడీకి శుభలేఖ..ఆశీస్సులు పంపిన ప్రధాని...

Feb 17, 2020, 10:41 AM IST

వారణాసిలోని మంగల్ కెవత్ అనే రిక్షా పుల్లర్ తన కుమార్తె వివాహానికి పిఎం మోడిని ఆహ్వానించాడు. దీనికి స్పందించిన మోడీ మంగల్ కుమార్తెకు వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ పంపారు. అందులో వధువుకు తన ఆశీస్సులు కూడా తెలిపారు. ప్రధాని మోడీ లేఖ అందుకున్న కెవత్ కుటుంబం చాలా సంతోషించింది.