టిక్ టాక్ పరిచయం.. బాలుడి కోసం ఆంటీ రాష్ట్రం వదిలి మరీ..

By telugu news teamFirst Published Apr 3, 2021, 10:10 AM IST
Highlights

ఆ బాలుడు వయసులో తనకన్నా చిన్నవాడని ఆమె తెలుసుకోలేకపోయింది. చిన్నవాడు మాత్రమే కాదు.. సదరు బాలుడు మైనర్ కావడం గమనార్హం. 

ఓ మహిళకు టిక్ టాక్ లో ఓ బాలుడు పరిచయం అయ్యాడు. అతనితో ప్రతిరోజూ చాట్ చేయడం మొదలుపెట్టింది. పీకల్లోతు ప్రేమలో కూడా మునిగిపోయింది. అయితే... ఆ బాలుడు వయసులో తనకన్నా చిన్నవాడని ఆమె తెలుసుకోలేకపోయింది. చిన్నవాడు మాత్రమే కాదు.. సదరు బాలుడు మైనర్ కావడం గమనార్హం. ఆ విషయం తెలియక.. తనవారందరినీ వదిలేసి అతనిని పెళ్లి చేసుకోవడానికి ఏకంగా రాష్ట్రం దాటి రావడం గమనార్హం. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబయికి చెందిన ఓ మహిళ టిక్ టాక్ లో ఓ బాలుడితో పరిచయం ఏర్పడింది. నాలుగు నెలలుగా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే ఆ మహిళకు తాను ప్రేమిస్తున్న వ్యక్తి మైనర్ అని తెలియదు. అయితే ఆ బాలునికి మహిళ గురించిన వివరాలు తెలియడంతో అతను ఆమెతో చాట్ చేయడం మానివేశాడు. 

దీంతో ఆమె ముంబై నుంచి నలందాలోని అతని ఇంటికి వచ్చేసింది. ఆమెను చూసిన ఆ బాలుని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. కాగా ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఉదంతం గురించి డీఎస్పీ డాక్టర్ శిల్పా నోమానీ మాట్లాడుతూ ఆ మహిళ కుటుంబ సభ్యులను ముంబై నుంచి ఇక్కడకు పిలిపించామని తెలిపారు. ఆ మహిళకు కౌన్సెలింగ్ ఇప్పించాక తిరిగి ముంబై వెళ్లిపోయిందన్నారు.

click me!