స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా రాయ్పూర్లో 342 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ. 3759 కోట్ల ఖర్చుతో ఇండోర్ అగ్రస్థానంలో ఉంది. వెల్లోర్, పుణెలో ఒక్కో ప్రాజెక్టుకి రూ. 60 కోట్లు మించింది. ఇంకా 83,000కి పైగా సీసీ కెమెరాలు, 52 లక్షల ఎల్ఈడి లైట్లు, 4,700 కి.మీ స్మార్ట్ రోడ్లు, 712 కి.మీ సైక్లింగ్ ట్రాక్లను నిర్మించారు.
దాదాపు 49,300 నివాస యూనిట్లు కూడా నిర్మించారు. 5 సంవత్సరాల్లో కేంద్రం రూ. 48,000 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్రాలు, మున్సిపల్లు అదే స్థాయిలో నిధులు సమకూర్చాయి. అయితే పీపీపీ మోడల్ ప్రాజెక్టులు కేవలం 6% మాత్రమే ఉండటం నిరాశ కలిగించింది. దీని లక్ష్యం 21%గా ఉంది.