సౌందర్య కొనుకున్న ఇష్టమైన ఇళ్లు చివరికి ఇలా అయిపోయిందా.. అయ్యో పాపం ?

First Published Jun 22, 2021, 12:12 PM IST

అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న సౌందర్య మరణించి దాదాపు 17ఏళ్లు అవుతుంది. అయినా ఆమె ఇష్టంగా కొనుకున్న ఇళ్లు ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఒకప్పుడు దేధీప్యమానంగా వెలిగిన ఇళ్లు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

సౌందర్య సౌత్‌ సినిమాలోనే ఓ ట్రెండ్‌ సెట్టర్. చీరకట్టులోని అందం ఏంటో చూపించింది. పొట్టి డ్రెస్సుల హవా కొనసాగుతున్న సమయంలో చీరలోనే అసలైన అందం ఉందని వెండితెరకి నిరూపించింది సౌందర్య, ఎక్స్ పోజింగ్‌కి దూరంగా, గ్లామర్‌కి అతీతంగా సినిమాలు చేసి లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగింది.
undefined
ఇలాంటి స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకోవడం ఆ సావిత్రి తర్వాత సౌందర్యకే దక్కిందని చెప్పొచ్చు. అందుకే సౌందర్యని అభినవ సావిత్రిగా పిలిచేవారు. ఆమె 2004లో హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
undefined
అయితే అప్పటికే సౌందర్య ఆస్తులు వంద కోట్లు ఉంటాయని టాక్‌ వినిపించింది. ఆ ఆస్తుల పంపకాలకు సంబంధించి పెద్ద వివాదాలే జరిగాయి. భర్త రఘు, సౌందర్య ఫ్యామిలీ వాళ్ల మధ్య ఆస్తి తగాదాలు కోర్ట్ వరకు వెళ్లాయి. ఆ వివాదాలపై ఇంకా క్లారిటీ లేదు.
undefined
ఇదిలా ఉంటే సౌందర్య హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్నాటకలో మెడికల్‌ కాలేజీని స్థాపించారు. అలాగే స్కూల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ వాటిని రన్‌ చేస్తున్నారు సౌందర్య ఫ్యామిలీ మెంబర్స్.
undefined
ఇప్పుడు సౌందర్య కొనుక్కున్న ఇష్టమైన ఇళ్లు ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. సౌందర్య బెంగుళూరులోని తన ఇంటిని కో ఆపరేటివ్‌ సోసైటీలో రిజిస్టర్‌ చేయించారు. దీన్ని భవాని హోమ్‌ బిల్డింగ్‌ కో ఆపరేటివ్‌ సోసైటీగా పిలుస్తుంటారు.
undefined
ఒకప్పుడు దేధీప్యమానంగా వెలిగిన ఆ ఇళ్లు ఇప్పుడు బూత్‌ బంగ్లాగా మారిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి ఆమని ఈ విషయాన్ని వెల్లడించారు. ఇండస్ట్రీలో సౌందర్య తనకు మంచి స్నేహితురాలు అని ఆమని చెప్పిన విషయం తెలిసిందే.
undefined
సౌందర్య మరణించిన కొన్నాళ్ళకు బెంగళూరులోని ఆమె బంగ్లాకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. సౌందర్య ఆ బంగ్లాను ఎంతో ఇష్టపడి కొనుక్కుందని, తను బతికున్నపుడు బంగ్లా దేధీప్యమానంగా వెలిగిపోయేదని, కానీ ఇప్పుడు అది ఓ బూత్‌ బంగ్లా మారిందని తెలిపింది.
undefined
తాను సౌందర్య మరణించిన అనంతరం కొన్నాళ్లకు ఆ బంగ్లాకు వెళ్లానని, అక్కడ ఎవరూ లేరని ఆమని పేర్కొన్నారు. అయితే కొద్ది రోజుల కిందటి వరకు సౌందర్య తల్లి అక్కడ ఉండేవారని, తనని కలుద్దామని అక్కడి వెళ్లేసరి ఇప్పుడు అక్కడ ఎవరూ లేరని, ఆ బంగ్లా పూర్తిగా పాతబడిపోయి చూడటానికి బూత్ బంగ్లాలా కనిపించినట్లు ఆమె ఎమోషనల్ అయ్యారు.
undefined
తను చనిపోవడానికి ఏడాది ముందు 2003లో సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ అయిన రఘుని సౌందర్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో వందకిపైగా సినిమాలు చేసిన సౌందర్య దాదాపు టాప్‌ స్టార్స్ అందరితోనూ నటించింది. స్టార్‌హీరోలకు దీటుగా ఇమేజ్‌ని, పారితోషికాన్ని అందుకుంది సౌందర్య. ప్రస్తుతం ఆమె జీవితంలో బయోపిక్‌కి ప్లాన్‌ జరుగుతుంది.
undefined
click me!