1947లో మనకు వచ్చింది నిజమైన స్వాతంత్య్రం కాదని, 2014లోనే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా, మతతత్వ వ్యాఖ్యలు ఆమె చేయగా, తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రాణాలు అర్పించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన దేశభక్తులను కంగనా అవమానపరిచారని, మెజారిటీ వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రభుత్వం ఆమెకు జాతీయ ఉత్తమ(National award) నటి అవార్డుతో పాటు, పద్మశ్రీ (Padhmashri) ప్రకటించడం జరిగింది. ఈ రెండు పురస్కారాలు బీజేపీ ప్రభుత్వ పుణ్యమే అని, తమకు అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న కంగనాకు లోపాయకారి ఒప్పందంపై అత్యుత్తమ పురస్కారాలు అందజేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవేమి పట్టించుకోని కంగనా, అవన్నీ తన ప్రతిభకు తార్కాణం అని చెప్పుకుంటున్నారు.
అలాగే కంగనా రనౌత్ (Kangana ranaut) తాను త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్ల పెళ్లి చేసుకొని, పిల్లల్ని కూడా కనాలని ప్రణాళిక వేసినట్లు చెప్పి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం లైఫ్ లో ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నట్లు, తెలియజేశారు.
మీరు ఎవరితో అయినా రిలేషన్ షిప్ లో ఉన్నారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు కంగనా.. అవును అని సమాధానం చెప్పారు. నేను ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నాను. అయితే అతను ఎవరు, పేరు ఏంటి అనే విషయాలు చెప్పను. త్వరలో మీకు తెలుస్తాయి.. అంటూ ఓపెన్ గా చెప్పేశారు.
బాలీవుడ్ కి వ్యతిరేకంగా స్టార్ హీరోలతో పాటు దర్శక నిర్మాతలపై ఓపెన్ గా వివాదాస్పద కామెంట్స్ చేసిన కంగనా వరుసగా చిత్రాలు చేయడం విశేషం. ఎన్ని వివాదాలు ఉన్నా, ఆమెకు మూవీ ఆఫర్స్ రావడం తగ్గడం లేదు.
ప్రస్తుతం కంగనా తన సొంత నిర్మాణ సంస్థలో టీకు వెడ్స్ షేరు చిత్రంలో నటిస్తున్నారు. జవాజుద్దిన్ సిద్ధిఖీ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సాయి కబీర్ దర్శకత్వం వహిస్తున్నారు.
బాలీవుడ్ కి వ్యతిరేకంగా స్టార్ హీరోలతో పాటు దర్శక నిర్మాతలపై ఓపెన్ గా వివాదాస్పద కామెంట్స్ చేసిన కంగనా వరుసగా చిత్రాలు చేయడం విశేషం. ఎన్ని వివాదాలు ఉన్నా, ఆమెకు మూవీ ఆఫర్స్ రావడం తగ్గడం లేదు.
ప్రస్తుతం కంగనా తన సొంత నిర్మాణ సంస్థలో టీకు వెడ్స్ షేరు చిత్రంలో నటిస్తున్నారు. జవాజుద్దిన్ సిద్ధిఖీ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సాయి కబీర్ దర్శకత్వం వహిస్తున్నారు.