యంగ్ హీరో నిఖిల్.. తన కెరీర్లో మరో సాహసం చేస్తున్నాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్నాడు. ఏకంగా యుద్ధం కోసం కోసం ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తున్నారట.
యంగ్ హీరో నిఖిల్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకుంటున్నాడు. `హ్యాపీడేస్`తో ప్రారంభమైన ఆయన కెరీర్ ఇప్పుడు తనకంటూ ఓ ఇమేజ్ని, క్రేజ్ని, మార్కెట్ని బిల్డ్ చేసుకున్నాడు. తనపై కోట్లు పెట్టే స్థాయికి ఎదిగాడు. `కార్తికేయ2`తో వంద కోట్ల హీరోల క్లబ్లో చేరిపోయాడు. ఇప్పుడు మరో సాహసం చేయబోతున్నారు. మరో భారీ సినిమాతో తానేంటో నిరూపించుకునేందుకు వస్తున్నాడు.
ప్రస్తుతం ఆయన హిస్టారికల్ మూవీ `స్వయంభు`లో నటిస్తున్నారు. పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఠాగూర్ మధు సమర్పణల పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ నటిస్తున్న 20వ మూవీ ఇది. ఇందులో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ యాక్షన్ కూడా చేయబోతుంది. కత్తి పట్టి యుద్ధం చేయబోతుంది. అందుకోసం ఆమె యుద్ధ విద్యలు కూడా నేర్చుకోవడం విశేషం.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఓ వార్ సీక్వెన్స్ ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. ఎపిక్ వార్ ఎపిసోడ్ షూటింగ్ ప్రస్తుతం నడుస్తుంది. దీనికోసం ఏకంగా ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తున్నారట టీమ్. దాదాపు 12 రోజుల పాటు ఈ వార్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుందని, దీనికి ఏకంగా ఎనిమిది కోట్లు అవుతుందని టీమ్ తెలిపింది.
ఒక యాక్షన్ సీక్వెన్స్ ని ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారంటే ఇది ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆడియెన్స్ అంచనాలను మించిన దీన్ని తెరకెక్కిస్తున్నట్టు టీమ్ చెబుతుంది. ఈ రేంజ్లో ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారంటే కచ్చితంగా నిఖిల్ కెరీర్లోనే ఇది నెక్ట్స్ లెవల్ మూవీ కాబోతుందని తెలుస్తుంది. మరి అదే స్థాయిలో ఆదరణ పొందితే టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఇది నిలుస్తుందని చెప్పొచ్చు. మరి ఈ స్థాయిలో ఆదరణ పొందుతుందో చూడాలి. దీన్ని ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాదిగానీ విడుదల చేసే అవకాశం ఉంది.