బాహుబలి దేవసేనగా సౌందర్య, వైరల్ అవుతున్న ఫొటోస్... అసలు విషయం ఏమిటంటే!

First Published Mar 15, 2021, 2:37 PM IST

ఈ తరం హీరోయిన్స్ లో అభినవ సావిత్రిగా పేరుపొందారు సౌందర్య. హీరోలకు సమానమైన స్టార్డం సౌందర్య సొంతం. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చిన నటిగా ఆమె వెండితెరను ఏలారు. సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా వెలిగిన సౌందర్య అకాల మరణం పొందారు. 
 

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీలో చేరిన సౌందర్య.. పార్టీ ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. సౌందర్య మరణించి దశాబ్దం దాటిపోయినా ఆమెను మాత్రం అభిమానులు మరచిపోవడం లేదు.

Soundarya

కాగా రాజమౌళి తెరకెక్కించిన చిత్ర రాజం బాహుబలిలో అనుష్క హీరోయిన్ గా నటించారు. బాహుబలి భార్యగా దేవసేన పాత్రలో అనుష్క అద్భుతంగా నటించారు.
undefined
కీలకమైన ఆ పాత్ర సౌందర్య చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఫ్యాన్స్ కి కలిగింది.  ఆలోచన వచ్చిందే తడవుగా అనుష్క దేవసేన ఫోటోలను మార్ఫింగ్ చేసి సౌందర్య ముఖం పెట్టారు. దేవసేనగా సౌందర్య ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వావ్ అంటున్నారు.

Soundarya

Soundaryaప్రస్తుతం సౌందర్య బాహుబలి దేవసేన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విధంగా సౌందర్య ఫ్యాన్స్ ఒక ట్రెండ్ సెట్టింగ్ రోల్ లో ఆమెను ఊహించుకుంటున్నారు.

Soundarya

Soundaryaఇక అనుష్క కర్ణాటకకు చెందిన హీరోయిన్ కాగా, సౌందర్య కూడా ఆ రాష్ట్రానికి చెందిన అమ్మాయే. ఒక దశాబ్ద కాలం సౌందర్య వెండితెరను ఏలారు.

Soundarya

సౌందర్య మరణం కారణంగా బాలకృష్ణ తన డ్రీం ప్రాజెక్ట్ నర్తనశాల మధ్యలోనే ఆపేశారు. ఆ సినిమాలో సౌందర్య ద్రౌపది పాత్ర చేయడం జరిగింది. ఆ పాత్రకు సౌందర్యను మినహా మరొకరిని ఊహించని బాలయ్య నర్తనశాల పక్కన పెట్టేశారు.
undefined
click me!