2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీలో చేరిన సౌందర్య.. పార్టీ ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. సౌందర్య మరణించి దశాబ్దం దాటిపోయినా ఆమెను మాత్రం అభిమానులు మరచిపోవడం లేదు.
Soundarya
కాగా రాజమౌళి తెరకెక్కించిన చిత్ర రాజం బాహుబలిలో అనుష్క హీరోయిన్ గా నటించారు. బాహుబలి భార్యగా దేవసేన పాత్రలో అనుష్క అద్భుతంగా నటించారు.
undefined
కీలకమైన ఆ పాత్ర సౌందర్య చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఫ్యాన్స్ కి కలిగింది. ఆలోచన వచ్చిందే తడవుగా అనుష్క దేవసేన ఫోటోలను మార్ఫింగ్ చేసి సౌందర్య ముఖం పెట్టారు. దేవసేనగా సౌందర్య ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వావ్ అంటున్నారు.
Soundarya
Soundaryaప్రస్తుతం సౌందర్య బాహుబలి దేవసేన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విధంగా సౌందర్య ఫ్యాన్స్ ఒక ట్రెండ్ సెట్టింగ్ రోల్ లో ఆమెను ఊహించుకుంటున్నారు.
Soundarya
Soundaryaఇక అనుష్క కర్ణాటకకు చెందిన హీరోయిన్ కాగా, సౌందర్య కూడా ఆ రాష్ట్రానికి చెందిన అమ్మాయే. ఒక దశాబ్ద కాలం సౌందర్య వెండితెరను ఏలారు.
Soundarya
సౌందర్య మరణం కారణంగా బాలకృష్ణ తన డ్రీం ప్రాజెక్ట్ నర్తనశాల మధ్యలోనే ఆపేశారు. ఆ సినిమాలో సౌందర్య ద్రౌపది పాత్ర చేయడం జరిగింది. ఆ పాత్రకు సౌందర్యను మినహా మరొకరిని ఊహించని బాలయ్య నర్తనశాల పక్కన పెట్టేశారు.
undefined