చేతులు పైకెత్తి నయగరా నడుము వంపులు చూపుతున్న హాటీ రాశి ఖన్నా... బంగారు వన్నె డ్రెస్ లో ఎల్లోరా శిల్పంలా!

First Published Sep 30, 2021, 4:46 PM IST


ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా(Raashi khanna) కొత్త ఫోటో షూట్ పిచ్చ వైరల్ గా మారింది. ట్రెండీ డిజైనర్ వేర్ లో అమ్మడు అందాలు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. 
 

గోల్డ్ కలర్ డ్రెస్ లో రాశి ఖన్నా అందాలను సరికొత్తగా ఫ్యాన్స్ కి  పరిచయం చేశారు. ఓ యాంగిల్ నుండి రాశి ఖన్నా నయాగరా లాంటి నడుము అందాలు చూపించింది. 
 

పొట్టి లోయర్ లో థైస్ చూపిస్తూ మత్తుగా చూస్తూ, మాయ వల వేస్తుంది. రాశి ఖన్నా ఫోటో షూట్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయగా, కామెంట్స్, లైక్స్ వెల్లువెత్తుతున్నాయి. 

బంగారు శిల్పంలా నిలువెత్తు అందాలతో కుర్రకారును రాశి చిత్తు చేయగా, ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి ఆమె కొత్త ఫోటోలు.

ఇక కెరీర్ పరంగా రాశి ఖన్నా జోరు మాములుగా లేదు. చేతినిండా సినిమాలతో ఊపిరి కూడా తీసుకోలేనంత బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, మలయాళ బాషలలో కలిపి ఏడెనిమి చిత్రాలు చేస్తుంది. 

మనం మూవీలో తళుక్కున మెరిసిన రాశి ఖన్నా... ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ లో పూర్తి స్థాయి హీరోయిన్ గా మారారు. ఆ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత చెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా ఏకంగా ఎన్టీఆర్ తో ఛాన్స్ కొట్టేసింది రాశి. 

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ చిత్రంలో రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ గా చేయడం విశేషం. జై లవకుశ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

ఇక 2019లో రాశి  నటించిన వెంకీ మామ, ప్రతిరోజూ పండగే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ గా నిలిచాయి. ఆ విజయాల నేపథ్యంలో రాశి టాలీవుడ్ ని దున్నేస్తుందని అందరూ భావించారు. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ పరాజయం ఆమె స్పీడ్ కి బ్రేక్ వేసింది. 

అలా అని ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గిందేమి లేదు. నాగ చైతన్యకు జంటగా థాంక్ యూ, మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. 


టాలీవుడ్ కంటే కూడా ఇప్పుడు కోలీవుడ్ లోనే బిజీగా ఉంది రాశి. విజయ్ సేతుపతి జంటగా నటించిన తుగ్లక్ దర్బార్ ఇటీవల విడుదల ఓటిటిలో విడుదల కావడం జరిగింది. అలాగే ఓ మలయాళ చిత్రంతో పాటు ఐదు తమిళ్ చిత్రాలు చేస్తున్నారు. 

click me!