సీనియర్ నటుడు పరేష్ రావల్ `హెరా ఫెరీ 3` సినిమా నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో పరేష్ రావల్పై అక్షయ్ కుమార్ పరువునష్టం దావా వేసిన నేపథ్యంలో, `హౌస్ ఫుల్ 5 `ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన ఈ వివాదంపై స్పందించారు.
అక్షయ్ కుమార్ `హెరా ఫెరీ 3` వివాదంపై స్పందించారు. పరేష్ రావల్ ఇటీవల `హెరా ఫెరీ 3` సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో పరేష్ రావల్ అభిమానులతోపాటు సినీ వర్గాలు సైతం షాక్కి గురయ్యారు.
ఈ వివాదంలో అక్షయ్ కుమార్.. పరేష్ రావల్ పై 25 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ దావా వేశారు. అయితే, ఇప్పటివరకు అక్షయ్ కుమార్ ఈ విషయం గురించి మాట్లాడలేదు, కానీ `హౌస్ ఫుల్ 5` ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దీని గురించి ఓపెన్ అయ్యారు.
అక్షయ్ కుమార్ ఫస్ట్ టైమ్ రియాక్షన్..
నా కోస్టార్ని 'మూర్ఖుడు' అని పిలవడం సరికాదు. నేను దీన్ని సమర్ధించను. ఆయనతో 30-32 ఏళ్లుగా పని చేస్తున్నాను. ఆయన నాకు మంచి స్నేహితుడు. ఆయన్ని చాలా గౌరవిస్తాను. ఇది చాలా సీరియస్ విషయం, కోర్టులో దీనికి పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఇక్కడ దీని గురించి మాట్లాడటం సరికాదు అని తెలిపారు అక్షయ్.
ప్రియదర్శన్ కన్నీళ్లు పెట్టుకున్నారట
'హెరా ఫెరీ 3' కోసం పరేష్ ఒప్పందంపై సంతకం చేసి అడ్వాన్స్ కూడా తీసుకున్నారు, కానీ ఆ తర్వాత ఆయన మరింత పారితోషికం కోరారు. నిర్మాతలు ఆయన డిమాండ్ కు ఒప్పుకోలేదు, దీంతో సినిమాలో నటించడానికి నిరాకరించారు. ఈ వార్త విన్న దర్శకుడు ప్రియదర్శన్ కన్నీళ్లు పెట్టుకున్నారట. సునీల్ శెట్టి కూడా ఈ వార్త విని షాక్ అయ్యారట.
`హెరాఫెరీ` సినిమా మొదటి రెండు భాగాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఈ సీక్వెల్పై భారీ అంచనాలున్నాయి. కానీ ఇలా పరేష్ రావల్ తప్పుకోవడం ఇప్పుడు వివాదంగా మారింది.