పెళ్లి తరువాత కమ్ బ్యాక్ ఇస్తున్న కలర్స్ స్వాతి... పంచతంత్రం అంటూ క్రేజీ ప్రాజెక్ట్ తో...

First Published Jul 1, 2021, 11:16 AM IST

స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి బుల్లితెరపై ఓ సంచలనం. టీనేజ్ కూడా దాటని ఓ క్యూట్ అమ్మాయి కలర్స్ ప్రోగ్రామ్ లో యాంకర్ గా మాయచేసింది. ఆమె వాక్చాతుర్యం, క్యూట్ యాంకరింగ్ భారీ టీఆర్పీ తెచ్చిపెట్టింది. ఒక్క ప్రోగ్రామ్ తో స్వాతి రెడ్డి.. కలర్స్ స్వాతిగా సూపర్ పాప్యులర్ అయ్యారు. 
 

అలా బుల్లితెరపై వచ్చిన ఫేమ్ తో నటిగా మారింది స్వాతి. 2005లో దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన డేంజర్ మూవీలో కీలక రోల్ చేశారు. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించక పోయినప్పటికీ స్వాతి నటనకు మంచి మార్కులే పడ్డాయి.
undefined
ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీ వెంకీని ప్రేమించే టీనేజ్ అమ్మాయిగా ఆకట్టుకుంది. తమిళ్ మూవీ సుబ్రమణ్యపురంలో లీడ్ హీరోయిన్ అవకాశం దక్కించుకున్న స్వాతి, హీరోయిన్ గా హిట్ కొట్టింది.
undefined
ఆ తర్వాత తెలుగులో అష్టా చెమ్మా, స్వామి రారా, కార్తికేయ వంటి సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. సౌత్ లో తెలుగు, తమిళ, మలయాళ బాషలలో 20కి పైగా చిత్రాలు చేశారు స్వాతి.
undefined
అయితే ఆమెకు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం దక్కలేదు. స్వాతి ఇమేజ్ రీత్యా కమర్షియల్ హీరోయిన్ గా మన దర్శక నిర్మాతలు గుర్తించలేదు. దీనితో ఆమె త్వరగానే ఫేడ్ అవుట్ అయ్యారు.
undefined
అవకాశాలు వస్తున్నప్పటికీ అవి చెప్పుకోదగ్గవి కావు.  దీనితో 2018లో మలయాళీ కుటుంబానికి చెందిన వికాస్ వాస్ అనే పైలట్ ని వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పిన స్వాతి విదేశాలలో సెటిల్ అయ్యారు.
undefined
కాగా స్వాతి తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్  చెప్పారు. ఆమె మరలా కమ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. పంచతంత్రం పేరుతో టీకెక్కుతున్న మూవీలో స్వాతి కీలక రోల్ చేస్తున్నారు.  దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగిపోయింది.
undefined
నూతన దర్శకుడు హర్ష పులిపాక తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శివాత్మిక రాజశేఖర్, సముద్ర ఖని, బ్రహ్మానందం కీలక రోల్స్ చేస్తున్నారు.
undefined
click me!