చంద్రబాబు డ్రగ్స్ తీసుకొంటున్నారేమో?: వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల

By narsimha lodeFirst Published Oct 26, 2021, 4:57 PM IST
Highlights

చంద్రబాబు డ్రగ్స్ తీసుకొంటున్నారేమోనని  వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు అనుమానం వ్యక్తం చేశారు.చంద్రబాబుకు నార్కో అనాలిసిస్ టెస్టు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

కడప:  Tdp చీఫ్ Chandrababu Naiduడ్రగ్స్ తీసుకొంటున్నారేమోననే అనుమానాన్ని Ycp ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు వ్యక్తం చేశారు.మంగళవారం నాడు కడప జిల్లా బద్వేల్ లో koramutla srinivasulu  మీడియాతో మట్లాడారు.రాష్ట్రంలో డ్రగ్స్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు సహా ఆయన టీమ్ కు డ్రగ్స్ పరీక్షలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

also read:ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు: రామ్ నాథ్ కోవింద్ తో భేటీ, వైసీపీపై ఫిర్యాదు

అధికార దాహంతో ఆర్టికల్ 356 ను రాష్ట్ర ప్రభుత్వంపై వినియోగించాలని చంద్రబాబు డిమాండ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు రాష్ట్రపతి Ramnath Kovind తో పాటు కేంద్ర మంత్రులను కలవడంపై  కోరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు.చంద్రబాబుకు నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బాబుకు మతి ఉందా, చిన్న మెదడు చిట్లి  పోయిందా అంటూ ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ  సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి కూడా ఆయన ఫిర్యాదు చేశారు.ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shah  అపాయింట్ మెంట్ లభించలేదు. దీంతో ఇవాళ సాయంత్రం ఆయన ఢిల్లీ నుండి నేరుగా హైద్రాబాద్ కు చేరుకొంటారు.ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి Pattabhi బూతు వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు పట్టాభి ఇంటిపై టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి.


 

click me!