తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది... వన్డే మ్యాచ్లో ఇది ఏమంత పెద్ద స్కోరు కాకపోయినా, ఈ మధ్యకాలంలో శ్రీలంక జట్టు పర్ఫామెన్స్ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం... ఈ స్కోరు టీమిండియా ఫ్యాన్స్ ఊహించనిది. ఏ మాత్రం అనుభవం లేని లంక జట్టు, తొలి వన్డేలో అంచనాలకు మించే రాణించింది.