INDvsSL 1st ODI: టీమిండియా ముందు ఊహించని టార్గెట్ పెట్టిన శ్రీలంక...
తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది... వన్డే మ్యాచ్లో ఇది ఏమంత పెద్ద స్కోరు కాకపోయినా, ఈ మధ్యకాలంలో శ్రీలంక జట్టు పర్ఫామెన్స్ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం... ఈ స్కోరు టీమిండియా ఫ్యాన్స్ ఊహించనిది. ఏ మాత్రం అనుభవం లేని లంక జట్టు, తొలి వన్డేలో అంచనాలకు మించే రాణించింది.
తొలి వికెట్కి 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత అవిష్క ఫెర్నాండో 35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 32 పరుగులు చేసి, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్లో తొలి బంతికే అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత చాహాల్ బౌలింగ్లో రెండు భారీ సిక్సర్లు బాది దూకుడు మీద కనిపించిన భునుక రాజపక్ష, కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు రాజపక్ష...
44 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసి భనుక కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లోనే అవుట్ కాగా 27 బంతుల్లో 14 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వను కృనాల్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు...
ఛరిత్ అసలంక 65 బంతుల్లో 38 పరుగులు, వానిందు హసరంగ 8 పరుగులు చేసి దీపక్ చాహార్ బౌలింగ్లో అవుట్ అయ్యారు...
లంక కెప్టెన్ దసున్ శనక 50 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 39 పరుగులు చేసి యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు..
భారత బౌలరలలో యజ్వేంద్ర చాహాల్ 52 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. రెండేళ్ల తర్వాత కలిసి ఆడిన ఈ జోడీ నుంచి నాలుగు కీలక వికెట్లు రావడం విశేషం.
భారత బౌలరలలో యజ్వేంద్ర చాహాల్ 52 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. రెండేళ్ల తర్వాత కలిసి ఆడిన ఈ జోడీ నుంచి నాలుగు కీలక వికెట్లు రావడం విశేషం.
భారత బౌలరలలో యజ్వేంద్ర చాహాల్ 52 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. రెండేళ్ల తర్వాత కలిసి ఆడిన ఈ జోడీ నుంచి నాలుగు కీలక వికెట్లు రావడం విశేషం.
కృనాల్ పాండ్యా 10 ఓవర్లలో ఓ మెయిడిన్తో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీయగా, భారత మెయిన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్కి వికెట్ దక్కకపోవడం విశేషం.
ఇసురు ఉదాన 8 పరుగులు చేసి, హార్ధిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కరుణ రత్నే , చమీరా కలిసి బౌండరీలు బాదడం మొదలెట్టారు. హార్ధిక్ వేసిన 49వ ఓవర్లో చమీరా ఓ ఫోర్, సిక్సర్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి.
ఆ తర్వాత భువీ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికే ఫోర్ బాదిన కరుణ రత్నే, ఆ తర్వాత వరుస రెండు సిక్సర్లతో లంకకు మంచి స్కోరును అందించాడు.