INDvsAUS 1st ODI: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... బుమ్రా, సైనీలతో బరిలోకి టీమిండియా
బుమ్రాకి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పిస్తారని ప్రచారం...
మొదటి వన్డేలో బరిలో దిగుతున్న బుమ్రా...
గాయంతో సైనీ దూరమవుతారని టాక్... మొదటి వన్డేలో బరిలో దిగుతున్న నవ్దీప్ సైనీ...
INDvAUS: ఆస్ట్రేలియా టూర్లో భాగంగా మొదటి వన్డేల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్కి అనుకూలిస్తుండడంతో భారత జట్టు ముందు భారీ టార్గెట్ ఉంచాలనే లక్ష్యంతో బ్యాటింగ్ చేయనుంది ఆస్ట్రేలియా.
మరోవైపు వన్డే సిరీస్ ఆరంభానికి ముందు బుమ్రాకి పొట్టి ఫార్మాట్లో విశ్రాంతినిస్తారని ప్రచారం జరిగింది భారత పేసర్ నవ్దీప్ సైనీ నడుము నొప్పితో బాధపడుతుండడంతో మొదటి వన్డేల్లో బరిలో దిగడం లేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరూ మొదటి వన్డేలో బరిలో దిగుతున్నారు. శిఖర్ ధావన్తో మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేస్తాడని ప్రకటించాడు విరాట్ కోహ్లీ.
మొదటి వన్డేకి భారత జట్టు ఇదే:
కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, జడేజా, షమీ, చాహాల్, బుమ్రా, సైనీ
మొదటి వన్డేకి ఆస్ట్రేలియా జట్టు ఇదే:
ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, లబుషేన్, మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హజల్వుడ్