ముంబయి స్లమ్ నుంచి.. మైక్రోసాఫ్ట్.. ఈ మహిళ ఎందరికో ఆదర్శం..!
బాంద్రా రైల్వే స్టేషన్కు సమీపంలోని దర్గా గల్లి మురికివాడలో తాను నివసించినట్లు శ్రీమతి అత్తర్వాలా తెలిపారు. ఆమె తండ్రి ఉత్తరప్రదేశ్ నుండి ముంబైకి మారిన సుగంధ నూనెల వ్యాపారి.
జీవితంలో ప్రతి ఒక్కరికీ కష్టాలు వస్తాయి. అయితే.. ఆ కష్టాలను ఎదిరించి.. కష్టపడినవారే.. జీవితంలో ఏదైనా సాధించగలరు. ఇదే విషయాన్ని ఓ మహిళ నిరూపించింది. ముంబయి స్లమ్ ఏరియా నుంచి.. మైక్రోసాఫ్ట్ వరకు ఎదిగింది. ఒకప్పుడు., కంప్యూటర్ ను చూస్తేనే గొప్పగా ఫీలైన ఆమె.. ఇప్పుడు ప్రముఖ టెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఒకప్పుడు రోడ్డుపై పడుకున్న ఆమె.. ఇప్పుడు అదే ముంబయిలో మంచి అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. ఆమె.. ముంబయి కి చెందిన షహీనా అత్తర్వాలా.
షహీనా తన జీవితంలో ఎదుర్కొన్న విషయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ లో డిజైనర్ లీడ్ గా ఉన్న శ్రీమతి షహీనా అత్తర్వాలా.. ఇటీవల నెట్ ఫ్లెక్స్ లో... బ్యాడ్ బాయ్ బిలియనర్స్ అనే సిరీస్ చూశారట. అందులో.. గతంలో..తాను ఉన్న స్లమ్ ఏరియా కనపడింది. అప్పుడు.. ఆమెకు తన గతాన్ని అందరికీ షేర్ చేసుకోవాలని అనిపించిందదట. ఆ ఇంటి ఫటోోను ట్విట్టర్ లో షేర్ చేసి.. తాను ఎదుర్కొన్న సవాళ్లను మొత్తాన్ని ట్విట్టర్ లో ఆమె రాసుకొచ్చింది.
బాంద్రా రైల్వే స్టేషన్కు సమీపంలోని దర్గా గల్లి మురికివాడలో తాను నివసించినట్లు శ్రీమతి అత్తర్వాలా తెలిపారు. ఆమె తండ్రి ఉత్తరప్రదేశ్ నుండి ముంబైకి మారిన సుగంధ నూనెల వ్యాపారి. మురికివాడలో జీవితం చాలా కష్టంగా ఉంటుందని.. లింగ పక్షపాతం , లైంగిక వేధింపులు ఎక్కువగా ఉండేవి అని ఆమె చెప్పారు.
"15 సంవత్సరాల వయస్సులో, నా చుట్టూ ఉన్న చాలా మంది స్త్రీలు నిస్సహాయంగా, ఇతరులపై ఆధారపడి ఉండేవారు. వారంతా దుర్వినియోగానికి గురవుతూ ఉండేవారు.వారికంటూ సొంతంగా ఎంపికలు చేసుకునే స్వేచ్ఛ లేకుండా, వారు కోరుకున్నట్లుగా జీవించేవారు కాదని ఆమె చెప్పారు. వారిలా తన జీవితం కాకూడదని అనుకున్నాని ఆమె చెప్పారు. అందుకే డిజిటల్ వైపు అడుగులు వేశానని ఆమె చెప్పారు.
పాఠశాలలో మొదటిసారిగా కంప్యూటర్ ని చూసినట్లు ఆమె చెప్పారు. ఆ కంప్యూటర్ నేర్చుకుంంటే.. మంచి అవకాశాలు దొరుకుతాయని అప్పుడే అనిపించిందని చెప్పారు. అయితే.. తన పరిస్థితులు.. కట్టుపనులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత.. అప్పు తీసుకొని మరీ కంప్యూటర్ నేర్చుకున్నట్లు ఆమె చెప్పారు. కంప్యూటర్ కొనుగోలు చేయడానికి భోజనాలు కూడా మానేసేదాన్ని అని ఆమె చెప్పారు.
"నేను ప్రోగ్రామింగ్ను విడిచిపెట్టి, డిజైన్లో వృత్తిని కొనసాగించాలని ఎంచుకున్నాను, ఎందుకంటే డిజైన్ అవకాశాలు ఉన్నాయని సాంకేతికత మార్పుకు సాధనం అని నమ్మేలా చేసింది" అని Ms అత్తర్వాలా చెప్పారు.
గత సంవత్సరం, సంవత్సరాల కృషి తర్వాత, Ms అత్తర్వాలా మరియు ఆమె కుటుంబం సూర్యకాంతి, వెంటిలేషన్ మరియు పచ్చదనం ఉన్న అపార్ట్మెంట్కు మారారు. చిన్నతనంలో మురికివాడలో ఉంటూ భోజనం మానేసిన తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని ఆమె చెప్పారు.. ప్రస్తుతం ఆమె ట్వీట్స్ వైరల్ గా మారాయి.