Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాలలో ఘోరం... ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన కారు, యువకుడు మృతి

జగిత్యాల : స్నేహితులతో కలిసి సరదాగా కారులో వెళుతుండగా ప్రమాదం జరిగి ఓ యువకుడు మృతిచెందాడు.

జగిత్యాల : స్నేహితులతో కలిసి సరదాగా కారులో వెళుతుండగా ప్రమాదం జరిగి ఓ యువకుడు మృతిచెందాడు. జగిత్యాల పట్టణ శివారులో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ఎస్సారెస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లింది. దీంతో కారు నడుపుతున్న మేడిపల్లి వార్తా రిపోర్టర్ రిజ్వాన్ నీటిలోమునిగి మృతిచెందగా రమేష్, అక్తర్, కరుణాసాగర్, కిషన్ ప్రాణాలతో బయటపడ్డారు. జగిత్యాల బీట్ బజార్ కు చెందిన ఐదుగురు చల్గల్ బైపాస్ నుండి అంతర్గాం మీదుగా జగిత్యాలకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఎస్సీరెస్పీ కాలువలో కారు పడినట్లు సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పెద్ద క్రేన్ ను తెప్పించి కారును బయటకు తీసి అందులో చిక్కుకున్న రిజ్వాన్ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసారు. అపస్మారక స్థితిలో వున్న రిజ్వాన్ కు సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేసారు పోలీసులు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా రిజ్వాన్ మృతిచెందాడు