Asianet News TeluguAsianet News Telugu

సిరిసిల్ల జిల్లాలో ఘోరం... ప్రేమించి పెళ్లాడిన యువతితో గొడవ, యువకుడి దారుణ హత్య

సిరిసిల్ల : ప్రేమించి పెళ్లాడిన యువతితో గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. 

సిరిసిల్ల : ప్రేమించి పెళ్లాడిన యువతితో గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. భార్య కోసం వెళ్లిన యువకుడు అత్తవారింట్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. రుద్రంగికి చెందిన గణేష్ అనే యువకుడు వేములవాడ రూరల్ మండలం వట్టెంల కి చెందిన యువతిని మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే  ఇటీవల భర్తతో గొడవపడి యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిన భార్యను కలిసేందుకు చందుర్తి మండలం నర్సింగ పూర్ గ్రామానికి వెళ్లిన గణేష్ అక్కడే గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి అతడిని దారుణంగా హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గణేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.