Asianet News TeluguAsianet News Telugu

తాళిబొట్టు తహసీల్దార్ ఆఫీస్ గుమ్మానికి వేలాడదీసి... బాధిత మహిళ వినూత్న నిరసన


సిరిసిల్ల: భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వుంటే ఆదారంగా వున్న భూమి కూడా కొందరు కాజేయాలని చూస్తున్నారని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.


సిరిసిల్ల: భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వుంటే ఆదారంగా వున్న భూమి కూడా కొందరు కాజేయాలని చూస్తున్నారని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి అక్రమాలను ఆపాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే అక్రమార్కులకు సాయం చేస్తోందని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ తాళిబొట్టును మండల రెవెన్యూ కార్యాలయ గుమ్మానికి వేలాడదీసి నిరసనకు దిగింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం-మంగ దంపతులకు 2 ఎకరాల భూమి వుండేది. అయితే మూడు సంవత్సరాల క్రితం రాజేశం చనిపోగా అతడి పేరిట వున్న భూమిని మంగ తన పేరిట పట్టా చేయించుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ అధికారుల అండదండలతో ఆ భూమిని కొందరు కబ్జా చేశారు. మూడు సంవత్సరాలుగా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదనకు గురయిన మంగ తన తాళిబొట్టు తీసి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ గెట్ కి వేలాడదీసింది. ఈ తాళిబొట్టును లంచంగా తీసుకొని అయినా తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకొంది.