Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అపశృతి... గోడకూలి ఇద్దరు కూలీల మృతి

కరీంనగర్ : స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా కరీంనగర్ లో చేపట్టిన డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు ఇద్దరిని బలితీసుకున్నాయి. 

కరీంనగర్ : స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా కరీంనగర్ లో చేపట్టిన డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు ఇద్దరిని బలితీసుకున్నాయి. ఎలాంటి భద్రతా చర్యలు పాటించకుండానే ఇళ్లముందు పెద్దపెద్ద గోతులు తల్లి పనులు చేస్తుండగా ఓ ఇంటి ప్రహారి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఇద్దరు కూలీలపై శిథిలాలు పడి మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంత ఘోరం జరిగినా అధికారులు, ప్రజాప్రతినిధులు చివరకు పనిచేయిస్తున్న కాంట్రాక్టర్ కూడా ఇప్పటివరకు స్పందించలేదు.