
రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం... సిరిసిల్లలో ఘోర ప్రమాదం
సిరిసిల్ల : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.
సిరిసిల్ల : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లోని ఆరు కార్లు అదుపుతప్పి ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఇలా ఆరు కార్లు ఢీకొనగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.కార్లు ఢీకొనగానే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడ్డారు.కొందరు మీడియా ప్రతినిధులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురయిన కార్లలో నాలుగు కాంగ్రెస్ నాయకులవి కాగా మరో రెండు రిపోర్టర్లవి. ప్రమాదం జరిగిన వెంటనే రేవంత్ కారుదిగి కార్లను పరిశీలించారు. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించే ఏర్పాట్లు చేసారు.
Add Asianetnews Telugu as a Preferred Source
