Asianet News TeluguAsianet News Telugu

మోసపోయి గర్భవతైన మైనర్ బాలిక.. తల్లే కాన్పు చేయబోగా... (చూడండి)

జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ కేంద్రంలో గర్భం దాల్చిన మైనర్ బాలిక మరణించిన అమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ కేంద్రంలో గర్భం దాల్చిన మైనర్ బాలిక మరణించిన అమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక మంచినీటి టాంక్ సమీపంలో ని కాలనీలోని 14 సంవత్సరాల బాలిక ప్రేమ ఉచ్చులో పడి గర్భం దాల్చింది. పొట్టలో నొప్పిగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లగా గర్భవతి అని తేల్చిచెప్పారు. తల్లి భాగ్యలక్ష్మి ప్రశ్నించినా సరిగా సమాధానం చెప్పలేకపోయింది కూతురు. 7 నెలలకే పురిటినొప్పులు రావడంతో స్వంతతల్లే కాన్పు చేయబోయింది. బొడ్డుపేగు సరిగా కట్ చేయరాక తల్లి, బిడ్డ చనిపోయినట్లు భాగ్యలక్ష్మి చెప్పింది. ఎవరికి తెలియకుండా శవాల్ని పూడ్చివేసిన సంఘటన ఆనోటా యినోటా పోలీసులు దృష్టిలోకి వెళ్ళటంతో శవాలను బయటికి తీసి పోస్ట్ మార్టంకు పంపించి తల్లి భాగ్యలక్ష్మి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మపురి ఎస్.ఐ.శ్రీకాంత్ తెలిపారు.