కరోనా ఎక్కువ మందికి రావాలని కోరుకునే వ్యక్తి ఉత్తమ్.. జగదీష్ రెడ్డి
పిసిసి నేత ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
పిసిసి నేత ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ వ్యాఖ్యాలు అర్ధరహితమని, ఉనికి కోసమే ఆ మాటలని అన్నారు. ఉత్తమ్ కరోనా కలోల్లం కోరుకుంటున్నారని, ప్రజలలో భయాందోళనలు కొనసాగాలని చూస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయం మీద మాట్లాడిన మాటలు ఆయన అవగాహన రాహిత్యానికి తార్కాణ అన్నారు.