Asianet News TeluguAsianet News Telugu

భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడని.. గొడల్లితో నరికి చంపిన భర్త...

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంపేటలో నడిరోడ్డుపై ఓ యువకుడిని నరికి చంపేశారు.

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంపేటలో నడిరోడ్డుపై ఓ యువకుడిని నరికి చంపేశారు. చనిపోయిన వ్యక్తి వేంపేటకు చెందిన దనరేకుల రాజేందర్ అని తేలింది. పాతకక్షలతో పాటు  అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడన్న కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. రమేష్, మహేష్ అనే అన్నదమ్ములిద్దరూ ఇంతకు ముందు మార్చి 3న మొదటిసారి కత్తులతో దాడి జరిపారని మెటుపల్లి డీఎస్పీ గౌస్ బాబా తెలిపారు. వారిని అరెస్ట్ చేసి జైలులో వేశామని, వీరిద్దరూ  నెల రోజుల క్రితం జైలు నుండి విడుదలై ఈ రోజు ఉదయం రాజేందర్ ను గొడ్డలితో విచక్షణరహితంగా నరికి చంపారని గౌస్ బాబా తెలిపారు.