ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్ ఓటర్ గా తన పేరును నమోదు చేసుకున్న మంత్రి కే తారకరామారావు
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకోసం ఓటర్ లిస్టులో పేరును మంత్రి కేటీఆర్ నమోదు చేసుకున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకోసం ఓటర్ లిస్టులో పేరును మంత్రి కేటీఆర్ నమోదు చేసుకున్నారు. ఈరోజు ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను స్థానిక మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం మరింతగా ఉందని మంత్రి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.