Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీకి తెలంగాణ వంటల రుచి చూపించనున్నది ఈమే... ఎవరీ యాదమ్మ?

హైదరాబాద్: ఆమె చేయి పడిందంటే వంటలు ఘుమఘుమలాడాల్సిందే. తెలంగాణ వంటకాలు వండటంలో ఆమె స్పెషలిస్ట్. వేల మందికయినా వంటిచేత్తో వంటలు వండిపెడుతుంది.

హైదరాబాద్: ఆమె చేయి పడిందంటే వంటలు ఘుమఘుమలాడాల్సిందే. తెలంగాణ వంటకాలు వండటంలో ఆమె స్పెషలిస్ట్. వేల మందికయినా వంటిచేత్తో వంటలు వండిపెడుతుంది. ఇలా శుచితో పాటు రుచిగా వండిపెట్టే సామాన్య మహిళ యాదమ్మ. కరీంనగర్ కు చెందిన ఈమె బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు విచ్చేసే అతిథులకు తెలంగాణ వంటలు రుచి చూపించనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బిజెపి అతిరథులు, కేంద్ర మంత్రులు, బిజెపి పాలితరాష్ట్రాల సీఎంలు యాదమ్మ చేతివంట తిననున్నారు. ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఇతర బిజెపి నాయకులతో ఏ వంటకాలు వండాలన్నదానిపై మాట్లాడినట్లు యాదమ్మ తెలిపారు. గుత్తివంకాయ, గంగవాయిలి పప్పు, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, సర్వపిండి వంటి తెలంగాణ స్పెషల్  శాఖాహార వంటకాలను దేశానికి పరిచయం చేయనున్నారు యాదమ్మ.